
Bikram Majithia: డ్రగ్స్ కేసులో పంజాబ్ మాజీ మంత్రి విక్రమ్ మజీతియా అరెస్టు!
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన 2021 నాటి డ్రగ్స్ కేసులో శిరోమణి అకాలి దళ్ (SAD) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మజీతియాను అరెస్టు చేసినట్లు సమాచారం. బుధవారం తెల్లవారుజామున విజిలెన్స్ అధికారులు అమృత్సర్ లోని మజీతియా నివాసంలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. విక్రమ్ మజీతియా శిరోమణి అకాలి దళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్కు సొంత బావ. ఆయన గతంలో పంజాబ్ రాష్ట్రమంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన భార్య గనీవే కౌర్ మజీతియా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021 నాటి డ్రగ్స్ కేసులో విక్రమ్ మజీతియా నిందితుడిగా ఉన్నారు.
Details
మజీతియాతో పాటు పలువురు అరెస్టు
ఈ కేసును పరిశీలిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మజీతియా, ఆయన కుటుంబానికి సంబంధించిన సంస్థల్లో అక్రమ లావాదేవీలు ఉన్నట్టు గుర్తించింది. ఈ క్రమంలో విజిలెన్స్ బ్యూరో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మజీతియా ఇంటిపై ఆకస్మిక రైడ్ చేయడం స్థానికంగా సంచలనం రేపింది. ఈ సమయంలో మజీతియాతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. 'కేసులో ఎవరినైనా అరెస్టు చేశారా?' అన్న ప్రశ్నకు అమృత్సర్ ఆర్పీఎస్ సంధూ 'అవును' అని సమాధానమిచ్చారు. 'అరెస్టయినవారిని ఇక్కడి నుంచి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు.