KTR: ఫార్ములా ఈ కేసు విచారణ అక్టోబర్ 30కి వాయిదా..
ఈ వార్తాకథనం ఏంటి
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది. విచారణ అనంతరం కేటీఆర్ తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ రేసు నిర్వహించిన విదేశీ కంపెనీకి ఇప్పటివరకు సమన్లు అందలేదని తెలిపారు. ఈ కారణంగానే కేసు విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసు సంస్థకు ఈమెయిల్ ద్వారా సమన్లు పంపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు కేటీఆర్ తరఫు న్యాయవాది వెల్లడించారు.
వివరాలు
మరోసారి సమన్ల కోసం పిటిషన్
అయితే, గతంలో తాము దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం రిటర్న్ చేసిందని చెప్పారు.
విదేశీ సంస్థకు సమన్లు జారీ చేయించేందుకు మరోసారి పిటిషన్ దాఖలు చేస్తామని న్యాయవాది తెలిపారు.
ఈ అంశంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందని పేర్కొన్నారు.