Page Loader
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు నక్సలైట్ల హతం
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు నక్సలైట్ల హతం

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు నక్సలైట్ల హతం

వ్రాసిన వారు Stalin
Apr 02, 2024
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలకు,నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు సీనియర్ పోలీసు అధికారి పిటిఐకి తెలిపారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సలైట్లు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు నక్సలైట్లు బుల్లెట్లకు గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆయన తెలిపారు.

Details 

ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ 

ఈ ఘటనతో ఈ ఏడాది ఇప్పటివరకు బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 34 మంది నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు. బీజాపూర్ జిల్లా బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. లోక్ సభ స్థానానికి తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగడం గమనార్హం. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నక్సలైట్లపై భద్రతా బలగాలు నిరంతర చర్యలు తీసుకుంటున్నాయి.