Jubilee Hills Bypoll: నేటితో ప్రచారానికి ఫుల్ స్టాప్.. సాయంత్రం నుంచి వైన్స్ బంద్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం ఈరోజు ముగియనుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు అధికార, ప్రత్యర్థి పార్టీ నేతల ప్రచారం, మైకులు, ప్రజాసంపర్క కార్యక్రమాలకు గడువు ముగుస్తుంది. సాయంత్రం 5 తర్వాత నియోజకవర్గంలో ఎటువంటి ప్రచారాలు, ర్యాలీలు కొనసాగించరాదు. ప్రచారం ముగిసిన వెంటనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రత్యేక ఆంక్షలు అమల్లోకి వస్తాయి. నియోజకవర్గంలో '144 సెక్షన్' అమలులోకి రానుంది. పోలింగ్ నవంబర్ 11న జరగనుంది, ఫలితాలు నవంబర్ 14న ప్రకటించబడతాయి. ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంది.
Details
సాయంత్రం 5 గంటల తర్వాత 144 సెక్షన్
అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి ప్రాతినిధ్యం చూపుతోంది. నేటితో ప్రచారం ముగియనందున, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు హోరాహోరా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాన నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి గరిష్ట ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఏర్పడినవి. ఆయన సతీమణి మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్, బీజేపీ నుండి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సాయంత్రం 5 తర్వాత 144 సెక్షన్ అమలులోకి రానుంది. పోలీస్ అధికారి సీపీ సజ్జనార్ ప్రజా భద్రత కోసం ఆదేశాలు జారీ చేశారు.
Details
144 సెక్షన్ అమలు సమయం
పోలింగ్ రోజున, నవంబర్ 11 ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ఫలితాల ప్రకటింపు రోజు, నవంబర్ 14 ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 15 ఉదయం 6 గంటల వరకు కూడా మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని వైన్స్, బార్లు, మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధ బార్లు (స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్ల బార్లు సహా) మూతపడతాయి. ఈ ఆంక్షలు నవంబర్ 12 వరకు కొనసాగుతాయి. ఓట్ల లెక్కింపు రోజున (నవంబర్ 14) కూడా మద్యం విక్రయాలపై నిషేధం కొనసాగుతుంది.