NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు
    తదుపరి వార్తా కథనం
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు
    భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు

    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు

    వ్రాసిన వారు Stalin
    Jan 16, 2023
    12:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రెండు రోజుల పాటు జీ20 సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 16, 17 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాల్లో 'థింక్-20' అనే థీమ్‌పై చర్చించనున్నారు. ఇందుకోసం రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.

    భోపాల్‌లోని కుషాభౌ థాక్రే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సమావేశాలు జరుగుతాయి. మేధావులు, ఆర్థికవేత్తలు, అధికారులతో పాటు విదేశీ దేశాల నుంచి కనీసం 94 మంది ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొనేందుకు భోపాల్ చేరకున్నారు.

    మొదటి రోజు మరో 10సమాంతర సమావేశాలను నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవస్థల పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, సాంప్రదాయ వైద్యం వంటి వివిధ అంశాలపై సమాంతర సెషన్లలో చర్చించనున్నారు.

    జీ20

    ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తొలి ప్రసంగం

    ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభ సెషన్‌ను ప్రారంభించి.. 'గ్లోబల్ గవర్నెన్స్ విత్ లైఫ్, వాల్యూస్, వెల్‌బీయింగ్'తో సహా పలు అంశాలపై ఆయన మాట్లాడుతారని ప్రభుత్వం సోమవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

    ప్రారంభ సెషన్‌లో ఇండోనేషియా రాజకీయ వ్యవహారాలు, చట్టం, రక్షణ, భద్రత డిప్యూటీ మంత్రి స్లామెట్ సోడర్సోనో, భారత జీ20 ప్రెసిడెన్సీ చీఫ్ కోఆర్డినేటర్ హర్ష్ వర్ధన్ ష్రింగ్లా, నీతి ఆయోగ్ వైస్ చైర్‌పర్సన్ సుమన్ బెరీ ప్రసంగిచనున్నారు.

    'థింక్-20' అనేది జీ20లో చర్చించే విషయాల్లో కీలమైన అంశమని చీఫ్ కో-ఆర్డినేటర్ హర్షవర్ధన్ ష్రింగ్లా చెప్పారు. భారత అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు అందరిని కలుపుకుపోయి.. ఫలితాలను సాధించేందుకు చర్యలు తీసుకుంటామని ష్రింగ్లా పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకూడదంటూ రవిశాస్త్రి కీలక సూచన! జస్పిత్ బుమ్రా
    Narne Nithin : సతీష్ వేగేశ్న - నార్నే నితిన్ కాంబోలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు', రిలీజ్ డేట్ లాక్ టాలీవుడ్
    USA: కాలిఫోర్నియాలో బాంబు పేలుడు కలకలం.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు అమెరికా
    Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో ఉదయాన్నే భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత! అరుణాచల్ ప్రదేశ్

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025