Page Loader
లంచం కేసులో గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌,మరో నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ 
లంచం కేసులో గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌,మరో నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ

లంచం కేసులో గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌,మరో నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2023
06:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

50 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెబి సింగ్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మంగళవారం అరెస్టు చేసింది. లంచం ఇచ్చిన వ్యక్తితో పాటు మరో నలుగురిని కూడా అరెస్టు చేశారు.ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలోని సింగ్ నివాసంలో కొద్దీ గంటల పాటు సోదాలు నిర్వహించిన ఆయనను తర్వాత అరెస్టు చేశారు. గెయిల్ ప్రాజెక్ట్‌కు అనుకూలంగా వ్యవహరించినందుకు సింగ్ లంచం డిమాండ్ చేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఢిల్లీ, నోయిడా, విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మహారత్న కంపెనీలలో గెయిల్ ఒకటి, ఇది భారతదేశంలోనే అతిపెద్ద సహజ వాయువు ట్రాన్స్‌మిష‌న్‌, మార్కెటింగ్ కంపెనీగా పేరొందింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లంచం కేసులో గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ అరెస్ట్