NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandhi: EVM లపై ఎలాన్ మస్క్ తో ఏకీభవించిన రాహుల్ గాంధీ
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandhi: EVM లపై ఎలాన్ మస్క్ తో ఏకీభవించిన రాహుల్ గాంధీ
    Rahul Gandhi: EVM లపై ఎలాన్ మస్క్ తో ఏకీభవించిన రాహుల్ గాంధీ

    Rahul Gandhi: EVM లపై ఎలాన్ మస్క్ తో ఏకీభవించిన రాహుల్ గాంధీ

    వ్రాసిన వారు Stalin
    Jun 16, 2024
    04:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని వాటిని రద్దు చేయాలని ఎలాన్ మస్క్ పిలుపుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు.

    వాటి విశ్వసనీయతపై జరుగతున్న చర్చలో జతకలిశారు. కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంకు కనెక్ట్ చేసిన మొబైల్ ఫోన్‌ను ఒక వ్యక్తి ఉపయోగించాడని వచ్చిన వార్తా క్లిప్పింగ్‌ను ఆయన పంచుకున్నారు.

    EVM మెషీన్‌ను అన్‌లాక్ చేసే OTPని రూపొందించడానికి ఈ మొబైల్ ఫోన్ ఉపయోగించారు.

    ఈవీఎం పరిశీలన 

    కౌంటింగ్ కేంద్రంలో ఫోన్ వాడినందుకు ఎంపీ బావమరిది బుక్కయ్యారు 

    ప్రశ్నించిన వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఎన్నికైన శివసేన ఎంపీ రవీంద్ర వైకర్‌కి బావగా గుర్తించారు.

    ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన 48 ఓట్ల తేడాతో గెలుపొందారు.

    జూన్ 4న కౌంటింగ్ కేంద్రంలో ఫోన్ వాడినందుకు నిందితుడు మంగేష్ పాండిల్కర్‌పై కేసు నమోదైంది.

    ఈ ఉదాహరణను ఉటంకిస్తూ, గాంధీ ఇలా వ్రాశారు, "భారతదేశంలో EVM లు ఒక "బ్లాక్ బాక్స్", వాటిని పరిశీలించడానికి ఎవరూ అనుమతించరు.

    సంస్థలు జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక బూటకంగా మారుతుంది... మోసానికి గురవుతుందని వ్యాఖ్యానించారు."

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ 

    EVMs in India are a "black box," and nobody is allowed to scrutinize them.

    Serious concerns are being raised about transparency in our electoral process.

    Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. https://t.co/nysn5S8DCF pic.twitter.com/7sdTWJXOAb

    — Rahul Gandhi (@RahulGandhi) June 16, 2024

    మోసం ఆరోపణలు 

    ఈవీఎం మోసాలపై రాజకీయ నాయకుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి 

    శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది కూడా ఈ సంఘటనపై తీవ్రంగా ప్రతిస్పందించారు. ఇది "అత్యున్నత స్థాయిలో మోసం" అని విమర్శించారు.

    భారత ఎన్నికల కమిషన్ దాని నిష్క్రియాత్మకతను దుయ్యబట్టారు.

    "ఈసీఐ ఇందులో జోక్యం చేసుకోకపోతే చండీగఢ్ మేయర్ ఎన్నికల తర్వాత అతిపెద్ద ఎన్నికల ఫలితాల స్కామ్ అవుతుంది .కోర్టులలో ఈ పోరాటాన్ని చూడవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ ఆకతాయితనానికి శిక్ష పడాల్సిందే" అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

    EVM తొలగింపు 

    ఎలాన్ మస్క్ EVMలను తొలగించాలని వాదించారు 

    అయితే, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ తన ప్రతిపక్షాల కంటే భిన్నమైన వైఖరిని తీసుకున్నారు, ఈవీఎంల గురించి మస్క్ అభిప్రాయాలను "తప్పు" అని పేర్కొన్నారు.

    చంద్రశేఖర్ సుదీర్ఘ పోస్ట్‌లో, మస్క్ ప్రకటనతో విభేదించారు తమ వద్ద వున్నంత "సురక్షితమైన డిజిటల్ హార్డ్‌వేర్‌ను ఎవరూ నిర్మించలేరని అభిప్రాయపడ్డారు.

    EVMలపై ట్యుటోరియల్‌ని అమలు చేయడానికి భారతదేశం సిద్ధంగా వుందని చెప్పారు.

    "మస్క్ అభిప్రాయం US ఇతర ప్రదేశాలకు వర్తించవచ్చు.. కానీ భారతీయ EVMలు అనుకూల రూపకల్పన, సురక్షితమైనవని తెలిపారు. ఏదైనా నెట్‌వర్క్, మీడియా నుండి వేరు చేశారని అని ఆయన పోస్ట్‌లో రాశారు.

    పేపర్ బ్యాలెట్లు 

    భారతీయ ఈవీఎంలు: సురక్షితమైనవి ట్యాంపర్ ప్రూఫ్, నిపుణులు అంటున్నారు 

    ముఖ్యంగా, భారతదేశం మూడవ తరం EVMలను ఉపయోగిస్తుంది. దీనిని M3 EVMలు అని కూడా పిలుస్తారు.

    అవి ట్యాంపర్ ప్రూఫ్, వాటిని తెరవడానికి ప్రయత్నించడం వలన అవి "సేఫ్టీ మోడ్"లోకి ప్రవేశించి పనిచేయవు.

    పటిష్టత , భద్రతను నిర్ధారించడానికి మూడు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రత్యేక బృందం ఈ యంత్రాలను అప్‌గ్రేడ్ చేసింది.

    "భారతీయ EVM లు ప్రపంచంలోని ఇతర EVM ల కంటే భిన్నంగా ఉంటాయని IIT బొంబాయి నుండి ప్రొఫెసర్ దినేష్ K శర్మ NDTV కి చెప్పారు. M3 EVM లకు మరే ఇతర పరికరానికి కనెక్షన్ లేదు, మెయిన్స్ విద్యుత్ సరఫరా కూడా లేదు."

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రాహుల్ గాంధీ

    Bharat Nyay Yatra: జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ 'భారత్ న్యాయ్ యాత్ర' ప్రారంభం భారతదేశం
    RahulGandhi : రాహుల్‌ గాంధీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు.. ఆయనో ఎంపీ మాత్రమే,పెద్దనాయకుడేం కాదట కాంగ్రెస్
    Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'  కాంగ్రెస్
    రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే  మల్లికార్జున ఖర్గే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025