NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gang rape: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం 
    తదుపరి వార్తా కథనం
    Gang rape: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం 
    మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం

    Gang rape: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 26, 2025
    08:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన చోటు చేసుకుంది.

    ఖండవా జిల్లాలోని ఒక గ్రామంలో ఓ గిరిజన మహిళ (45) పై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమె ప్రైవేటు భాగాల్లోకి ఇనుప రాడ్డును చొప్పించారు.

    పోలీసుల కథనం ప్రకారం.. ఖండవా జిల్లాలోని ఓ గ్రామంలో వివాహ కార్యక్రమం జరిగింది.

    ఆ వేడుకకు సమీప గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

    బాధితురాలు కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ వివాహానికి హాజరైంది.అయితే అదే రాత్రి ఆమె అనూహ్యంగా కనబడకుండా పోయింది.

    శనివారం,గ్రామంలోని ఒక ఇంటి వెనుకభాగంలో ఓ ఇంటి వెనుక బాధితురాలు పడి ఉండటాన్ని కొందరు మహిళలు గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

    వివరాలు 

    పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబం 

    గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను వారు ఇంటికి తీసుకెళ్లగా,తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పే ప్రయత్నంలోనే ఆమె తుదిశ్వాస విడిచింది.

    చాలాచోట్ల తీవ్రమైన గాయాల గుర్తులతో శరీరం రక్తమోడుతోంది. మహిళ మృతి చెందిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఖండవాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా,వైద్యులు గర్భాశయం కూడా బయటకు వచ్చినట్లు తెలిపారు.

    ఇంతటి క్రూరమైన అఘాయిత్యం నేపథ్యంలో బాధిత కుటుంబం శనివారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    దీంతో రంగంలోకి దిగిన రోశ్నీ చౌకీ పోలీసులు గాలింపు చేపట్టారు.

    విచారణలో భాగంగా బాధితురాలి గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

    బాధితురాలికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. మహిళపై జరిగిన నేరాన్ని నిర్ధారించిన పోలీసులు, నిందితుల విచారణ కొనసాగుతోందని ఖండవా ఏఎస్పీ రాజేశ్ రఘువంశీ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Gang rape: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం  మధ్యప్రదేశ్
    Taj Mahal: తాజ్ మహల్ వద్ద అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తాజ్ మహల్
    Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం? ఉక్రెయిన్ డ్రోన్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న రష్యా అధ్యక్షుడు  వ్లాదిమిర్ పుతిన్
    SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్

    మధ్యప్రదేశ్

    Madhyapradesh: కుటుంబంలో 8 మందిని నరికి .. ఆపై ఉరేసుకున్నాడు  భారతదేశం
    Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం,ట్రాక్టర్-ట్రాలీ బోల్తా పడి 13 మంది మృతి  భారతదేశం
    Indore: ఇండోర్ లోక్‌సభ స్థానంలో నోటాకు 1.7 లక్షల ఓట్లు.. గోపాల్‌గంజ్‌ గత రికార్డు బద్దలు  ఇండోర్
    Madhyapradesh : పాఠశాల పాఠ్యాంశాల్లో 'ఎమర్జెన్సీ' కాలాన్ని చేర్చనున్న మధ్యప్రదేశ్  మోహన్ యాదవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025