Agra: ఆగ్రా హోటల్లో మహిళపై సామూహిక అత్యాచారం.. ఐదుగురి అరెస్టు
ఆగ్రాలోని ఓ హోటల్లో ఓ మహిళపై బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. తన స్నేహితుడితో పాటు మరికొందరు బలవంతంగా తాగించారని,గదిలోకి ఈడ్చుకెళ్లారని, నిరసన తెలిపేందుకు ప్రయత్నించినప్పుడు కొందరు వ్యక్తులు తనను కొట్టారని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని అత్యాచారం, దాడి, ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో నలుగురు పురుషులు, ఒక మహిళను అరెస్టు చేశారు. అత్యాచార బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. ఆమె ఓ హోటల్లో ఎడాదిన్నరగా పని చేస్తోంది. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన వీడియోలో ఒక వ్యక్తి ఆమెను గదిలోకి బలవంతగా తీసుకువెడుతున్న దృశ్యం రికార్డు అయ్యింది.
హోటల్లో అత్యాచారం జరిగినట్లు పోలీసులకు సమాచారం
"దయచేసి నాకు సహాయం చెయ్యండి!", అని ఆమె అరవడం వీడియోలో వినబడింది. ఒక వ్యక్తి ఆమెను ఒక గదిలోకి లాగారు. తనను బలవంతంగా గదిలో బంధించి దారుణంగా కొట్టారని మహిళ పోలీసులకు తెలిపింది. నిందితులు ఆమెను బలవంతంగా మద్యం తాగించారు. సీనియర్ పోలీసు అధికారి సదర్ అర్చన సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆగ్రాలోని తాజ్గంజ్ పోలీసులకు హోటల్లో అత్యాచారం జరిగినట్లు సమాచారం అందింది. ప్రాణాలతో బయటపడిన వారి ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని కేసు నమోదు చేశారు.