NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం
    తదుపరి వార్తా కథనం
    ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం
    వందేళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు

    ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం

    వ్రాసిన వారు Stalin
    Mar 09, 2023
    12:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర ముంబయికి సముద్రం ద్వారా వచ్చే సందర్శకులకు స్వాగతం పలికేందుకు 100ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన కట్టడం 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు ఏర్పడినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

    గేట్‌వే ఆఫ్ ఇండియా ముఖ ద్వారంలో పగుళ్లతోపాటు గోపురాల్లో వాటర్‌ఫ్రూఫింగ్, సిమెంట్ కాంక్రీట్‌ పెచ్చలూడుతున్నట్లు స్ట్రక్చరల్ ఆడిట్ రిపోర్టు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వివరించింది.

    దాదాపు 100 ఏళ్ల నాటి ఈ స్మారక చిహ్నం మరమ్మత్తు కోసం ప్రతిపాదించిన రూ.8 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామమని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ హామీ ఇచ్చారు.

    గేట్‌వే ఆఫ్ ఇండియా

    2006లో గేట్‌వే ఆఫ్ ఇండియాకు చివరి మరమ్మతులు

    అరేబియా సముద్రం ఎదురుగా వందేళ్ల క్రితం గేట్‌వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. ఇది గ్రేడ్-I వారసత్వ స్మారక చిహ్నంగా గుర్తింపు పొందింది.

    రాష్ట్ర పురావస్తు, మ్యూజియంల డైరెక్టరేట్ సుమారు మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. అలాగే ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ అభా నారాయణ్ లంబా సంయుక్తంగా గేట్‌వే ఆఫ్ ఇండియా పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి పంపారు. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం నిధులను విడుదల చేస్తామని చెప్పింది.

    గేట్‌వే ఆఫ్ ఇండియా చివరి మరమ్మతులు 2006లో జరిగాయి.

    మరమ్మతులకు ఏడాది సమయం పడుతుందని, వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ అభా నారాయణ్ లంబా పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై
    మహారాష్ట్ర

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ముంబై

    విస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన విమానం
    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ఎన్ఐఏ
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ నితిన్ గడ్కరీ
    జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత సుప్రీంకోర్టు

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి ఏక్‌నాథ్ షిండే
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి రోడ్డు ప్రమాదం
    Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025