NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం
    భారతదేశం

    ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం

    ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 09, 2023, 12:44 pm 1 నిమి చదవండి
    ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం
    వందేళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు

    మహారాష్ట్ర ముంబయికి సముద్రం ద్వారా వచ్చే సందర్శకులకు స్వాగతం పలికేందుకు 100ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన కట్టడం 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు ఏర్పడినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. గేట్‌వే ఆఫ్ ఇండియా ముఖ ద్వారంలో పగుళ్లతోపాటు గోపురాల్లో వాటర్‌ఫ్రూఫింగ్, సిమెంట్ కాంక్రీట్‌ పెచ్చలూడుతున్నట్లు స్ట్రక్చరల్ ఆడిట్ రిపోర్టు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వివరించింది. దాదాపు 100 ఏళ్ల నాటి ఈ స్మారక చిహ్నం మరమ్మత్తు కోసం ప్రతిపాదించిన రూ.8 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామమని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ హామీ ఇచ్చారు.

    2006లో గేట్‌వే ఆఫ్ ఇండియాకు చివరి మరమ్మతులు

    అరేబియా సముద్రం ఎదురుగా వందేళ్ల క్రితం గేట్‌వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. ఇది గ్రేడ్-I వారసత్వ స్మారక చిహ్నంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర పురావస్తు, మ్యూజియంల డైరెక్టరేట్ సుమారు మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. అలాగే ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ అభా నారాయణ్ లంబా సంయుక్తంగా గేట్‌వే ఆఫ్ ఇండియా పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి పంపారు. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం నిధులను విడుదల చేస్తామని చెప్పింది. గేట్‌వే ఆఫ్ ఇండియా చివరి మరమ్మతులు 2006లో జరిగాయి. మరమ్మతులకు ఏడాది సమయం పడుతుందని, వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ అభా నారాయణ్ లంబా పేర్కొన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    మహారాష్ట్ర
    ముంబై

    మహారాష్ట్ర

    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు సుప్రీంకోర్టు
    మహారాష్ట్ర: అకోలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ; 144 సెక్షన్ విధింపు తాజా వార్తలు
    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా? షిర్డీ సాయిబాబా

    ముంబై

    26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్  అమెరికా
    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా  భారతదేశం
     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ  టెక్నాలజీ
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023