NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / GBS outbreak: మహారాష్ట్రలో 163కి చేరుకున్న జీబీఎస్‌ కేసులు.. 47 మంది ఐసీయూలో,వెంటిలేటర్‌పై 21 మంది బాధితులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    GBS outbreak: మహారాష్ట్రలో 163కి చేరుకున్న జీబీఎస్‌ కేసులు.. 47 మంది ఐసీయూలో,వెంటిలేటర్‌పై 21 మంది బాధితులు
    మహారాష్ట్రలో 163కి చేరుకున్న జీబీఎస్‌ కేసులు.. 47 మంది ఐసీయూలో,వెంటిలేటర్‌పై 21 మంది బాధితులు

    GBS outbreak: మహారాష్ట్రలో 163కి చేరుకున్న జీబీఎస్‌ కేసులు.. 47 మంది ఐసీయూలో,వెంటిలేటర్‌పై 21 మంది బాధితులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 04, 2025
    12:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని పూణే నగరాన్ని ఒక అంతుచిక్కని వ్యాధి పట్టిపీడిస్తోంది. తాజాగా, అరుదైన నాడీ సంబంధిత రుగ్మతతో మరో ఐదుగురిని గుర్తించారు.

    ఈ ఘటనతో మహారాష్ట్రలో గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) అనుమానిత కేసుల సంఖ్య 163కి చేరింది.

    రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని వెల్లడించారు.

    వివరాలు 

    47 మంది ఐసియులో 

    తాజాగా జీబీఎస్ (Guillain-Barré Syndrome) కారణంగా ఎవరూ మరణించకపోయినా, సోమవారం మరో ఐదు కొత్త కేసులు నమోదయ్యాయని వైద్యాధికారి తెలిపారు.

    మొత్తం 127 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యిందని ఆయన వెల్లడించారు.

    పూణే నగరంలో 32, పూణే మునిసిపల్ కార్పొరేషన్‌కు కొత్తగా అనుసంధానించిన గ్రామాల నుండి 86, పింప్రి-చించ్వాడ్‌లో 18, పూణే గ్రామీణ ప్రాంతంలో 19, ఇతర జిల్లాల్లో ఎనిమిది కేసులు నమోదు కాగా, మొత్తం అనుమానిత కేసుల సంఖ్య 163కి చేరిందని ఆయన వివరించారు.

    ఈ 163 మంది రోగుల్లో 47 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని, 47 మంది ఐసియులో చికిత్స పొందుతుండగా, 21 మంది వెంటిలేటర్లపై ఉన్నారని ఆయన వెల్లడించారు.

    వివరాలు 

    క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం 

    పూణే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మొత్తం 168 నీటి నమూనాలను రసాయన, జీవ విశ్లేషణ కోసం ప్రజారోగ్య ప్రయోగశాలకు పంపించామని ఆయన తెలిపారు.

    ఈ నమూనాల్లో ఎనిమిది నీటి వనరులు కలుషితమైనట్లు తేలిందని వెల్లడించారు.

    గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) ఒక అరుదైన వ్యాధి. ఇది సోకినప్పుడు శరీరంలోని వివిధ అవయవాలు ఆకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి, కండరాలు బలహీనపడతాయి.

    చేతులు, కాళ్లలో తీవ్రమైన బలహీనత ఏర్పడుతుంది. నిపుణుల ప్రకారం, కలుషితమైన ఆహారం, నీటిలో ఉండే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణమని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా
    TG Inter Board: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం తెలంగాణ

    మహారాష్ట్ర

    Devendra Fadnavis: మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌.. శిందే వర్గం నేత కీలక వ్యాఖ్యలు  భారతదేశం
    Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై నేడు నిర్ణయం, మహాయుతి నేతలతో అమిత్ షా సమావేశం భారతదేశం
    Maharastra: మహారాష్ట్ర క్యాబినెట్‌లో సగం బెర్త్‌లు బీజీపీ తీసుకునే అవకాశం.. షిండే వర్గానికి మూడు కీలక మంత్రి పదవులు  భారతదేశం
    Maharashtra: అమిత్ షాతో మహాయుతి నేతలు భేటీ; త్వరలో సీఎం ప్రకటన భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025