NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Visakhapatnam: ఏజెన్సీ ప్రాంత తేనెకు అంతర్జాతీయ బ్రాండ్‌.. గీతం ప్రొఫెసర్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Visakhapatnam: ఏజెన్సీ ప్రాంత తేనెకు అంతర్జాతీయ బ్రాండ్‌.. గీతం ప్రొఫెసర్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు
    ఏజెన్సీ ప్రాంత తేనెకు అంతర్జాతీయ బ్రాండ్‌.. గీతం ప్రొఫెసర్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు

    Visakhapatnam: ఏజెన్సీ ప్రాంత తేనెకు అంతర్జాతీయ బ్రాండ్‌.. గీతం ప్రొఫెసర్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 21, 2025
    02:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సేకరించే తేనెకు ప్రత్యేకమైన బ్రాండ్‌ను అందించేందుకు విశాఖపట్టణంలోని గీతం విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఐ. శరత్‌బాబు 'మోనోఫ్లోరల్‌ హనీ' పేరిట ఓ ప్రాజెక్టును రూపొందించారు.

    సంప్రదాయ పద్ధతుల్లో సేకరించే ఈ సహజ వనరుకు శాస్త్రీయత, సాంకేతికతలు జోడించి, నాణ్యతను పెంచి అంతర్జాతీయ మార్కెట్‌లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

    వివరాలు 

    సైన్స్ & టెక్నాలజీ హబ్స్ ఏర్పాటు 

    కేంద్ర ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ విభాగం (DST), గీతం సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరులో రూ.3.64 కోట్ల వ్యయంతో 4 సైన్స్, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ హబ్స్‌ను ఏర్పాటు చేశారు.

    ఈ ప్రాజెక్టులో భాగంగా 30 గ్రామాలకు చెందిన 250 మంది గిరిజనులకు తేనె సేకరణపై శిక్షణ ఇచ్చి, మార్కెటింగ్‌ చేయడానికి ప్రోత్సహిస్తున్నారు.

    శాస్త్రీయ విధానాలతో తేనె ఉత్పత్తి

    రైతులకు శాస్త్రీయంగా తయారుచేసిన వలిసె విత్తనాలను అందించి,తగిన విధంగా సాగు చేయిస్తున్నారు.

    ఆ పొలాల్లో ఏడాది పొడవునా సీజన్‌ ప్రకారం అంతర పంటలు పండిస్తున్నారు.

    తేనెటీగల పెంపకానికి వీలుగా తగిన తేనెలు ఇచ్చే మొక్కలు పెంచి,తేనెటీగలకు అవసరమైన మకరందాన్ని అందిస్తున్నారు.

    వివరాలు 

    త్వరలో ఆన్‌లైన్‌ విక్రయాలు 

    ప్రతి యూనిట్‌లో ఆటోమేటిక్‌ మాయిశ్చర్‌ కంట్రోల్, ఉష్ణోగ్రత నియంత్రణ, ఫిల్టరేషన్‌ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా తేనెను శుద్ధి చేసి, 18 రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

    2023లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు తొలి ఏడాదిలోనే 500 కిలోలకుపైగా తేనె సేకరించి విక్రయించారు.

    ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ-కామర్స్‌ వేదికగా తేనెను విక్రయించాలని నిర్ణయించారు.

    దీనివల్ల అరకు కాఫీ మాదిరిగా ఈ తేనెకు కూడా ప్రత్యేకమైన బ్రాండ్‌ గుర్తింపు లభించనుంది.

    2027 నాటికి ప్రతి ఏడాది రూ.1 కోట్ల విలువైన తేనెను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

    వివరాలు 

    4,000 మందికి ఉపాధి

    ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా 4,000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

    ఒక్కో కుటుంబానికి నెలకు రూ.20,000కుపైగా ఆదాయం వస్తోంది.

    గిరిజనులు సేకరించే ఉత్పత్తులకు శాస్త్రీయత, సాంకేతికతలు జోడించి మార్కెటింగ్‌ చేయడం ద్వారా అధిక డిమాండ్‌ ఏర్పడుతుందని, త్వరలోనే ఫార్మర్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్గనైజేషన్స్‌ను (FPOs) ఏర్పాటు చేసి, బాధ్యతలను వారి చేతిలో పెట్టనున్నట్లు ప్రాజెక్టు నిర్వాహకుడు డాక్టర్‌ శరత్‌బాబు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత  కింజరాపు రామ్మోహన్ నాయుడు
    Operation Sindoor: భారత్‌లోకి ప్రవేశించేందుకు ముష్కరుల ప్రయత్నాలు.. అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్‌.. ఏడుగురు హతం ఆపరేషన్‌ సిందూర్‌
    China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చైనా
    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ

    విశాఖపట్టణం

    Combodia: మానవ అక్రమ రవాణా ద్వారా కంబోడియాకు చేరుకున్న 300 మంది భారతీయులు అరెస్టు  కంబోడియా
    Fake CBI Gang Cleans: నకిలీ సీబీఐ అధికారుల హల్‌చల్‌ ...MNC,AGMకి రూ .85 లక్షల టోకరా  భారతదేశం
    Visakhapatnam: కంటికి అరుదైన శస్త్రచికిత్స.. మనిషి కన్ను,మెదడు నుండి 12 అంగుళాల పుల్లను తొలగించిన వైద్యులు భారతదేశం
    Fire Accident: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025