NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhyapradesh: యాచకులకు డబ్బులు ఇస్తే మీపై ఎఫ్ఐఆర్ నమోదు.. జనవరి ఒకటి నుంచి అమలు 
    తదుపరి వార్తా కథనం
    Madhyapradesh: యాచకులకు డబ్బులు ఇస్తే మీపై ఎఫ్ఐఆర్ నమోదు.. జనవరి ఒకటి నుంచి అమలు 
    యాచకులకు డబ్బులు ఇస్తే మీపై ఎఫ్ఐఆర్ నమోదు.. జనవరి ఒకటి నుంచి అమలు

    Madhyapradesh: యాచకులకు డబ్బులు ఇస్తే మీపై ఎఫ్ఐఆర్ నమోదు.. జనవరి ఒకటి నుంచి అమలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 17, 2024
    01:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని వివిధ నగరాల్లో యాచన ఇప్పుడు వ్యాపారంగా మారింది. అలా యాచకులు బిక్షాటన కోసం అనేక అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు.

    ఈ ప్రక్రియను నిరోధించడానికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ 2025 జనవరి 1 నుంచి యాచకులకు డబ్బులు ఇచ్చే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయించింది.

    కేంద్ర ప్రభుత్వ పయిలట్ ప్రాజెక్టు భాగంగా, ఇండోర్‌ను యాచకరహిత నగరంగా మారుస్తున్న ఈ కార్యక్రమం దేశంలోని 10 నగరాల్లో అమలవుతోంది.

    వాటిలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పట్నా, అహ్మదాబాద్ వంటి నగరాలు ఉన్నాయి.

    వివరాలు 

    ఆరు నెలలపాటు యాచకులకు ఆశ్రయం

    ఈ ప్రాజెక్టు అధికారి దినేష్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, నగరంలో కొన్ని యాచకులు శాశ్వత ఇళ్లను కలిగి ఉన్నారని, కొందరి పిల్లలు బ్యాంకుల్లో పనిచేస్తున్నారని,మరికొందరు వడ్డీలకు అప్పులు ఇస్తున్నారని వెల్లడించారు.

    రాజస్థాన్‌ నుంచి ఒక ముఠా పిల్లలతో కలిసి యాచన కోసం ఇండోర్‌కు వచ్చిందని,వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

    మధ్యప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా ఈ సందర్భంగా మాట్లాడుతూ, నగరాన్ని యాచకరహితంగా మార్చేందుకు స్వచ్ఛంద సంస్థ ఒక ఆశ్రయం ఏర్పాటు చేస్తుందని,ఆ సంస్థ ఆరు నెలలపాటు యాచకులకు ఆశ్రయం అందిస్తుందని తెలిపారు.అర్హులైన వారికి వివిధ పనులపై శిక్షణ కూడా ఇవ్వబడుతుందని చెప్పారు.ఈ పథకం విజయవంతం కావాలంటే ప్రజలు బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వడం మానుకోవాలని ఆయన సూచించారు.

    వివరాలు 

     10 దేశీయ నగరాల్లో ఈ ప్రయత్నం 

    ఇండోర్‌లో యాచకులపై నిషేధం విధించబడినది. 10 దేశీయ నగరాల్లో ఈ ప్రయత్నం జరుగుతోంది.

    ఇండోర్‌లో బిచ్చగాళ్లకు ఆశ్రయం కల్పించడానికి ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది.

    ఇప్పటికే ఇండోర్‌ అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరు పొందింది, ఇకపై ఇది యాచకరహిత నగరంగా మారాలని లక్ష్యం.

    2025 జనవరి 1 నుంచి, యాచకులకు డబ్బులు ఇచ్చే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుందని, జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    Kavitha: 'భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు'.. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్‌కు కవిత లేఖ!  కల్వకుంట్ల కవిత
    Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా యోచన బంగ్లాదేశ్
    Trump: హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్‌ మరో పెద్ద షాక్‌.. విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం అమెరికా

    మధ్యప్రదేశ్

    Madhya Pradesh: మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు దగ్ధం  భోపాల్
    Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి  రోడ్డు ప్రమాదం
    Bhojshala Row: భోజ్‌శాల ఆలయం-కమల్ మౌలా మసీదుపై ఏఎస్ఐ సర్వే  భారతదేశం
    Madhyapradesh: మహాకాల్ ఆలయంలో ప్రమాదం.. ప్రధాన పూజారితో సహా 13 మందికి గాయాలు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025