NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jaishankar: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే వాదనతో నేను ఏకీభవించను: ఎస్‌.జైశంకర్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Jaishankar: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే వాదనతో నేను ఏకీభవించను: ఎస్‌.జైశంకర్ 
    ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే వాదనతో నేను ఏకీభవించను: ఎస్‌.జైశంకర్

    Jaishankar: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే వాదనతో నేను ఏకీభవించను: ఎస్‌.జైశంకర్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 15, 2025
    10:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనే అభిప్రాయాన్ని తాను సమర్థించనని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ అన్నారు.

    ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజలు స్వేచ్ఛగా, ఆనందంగా జీవిస్తున్నారని, ఓటింగ్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

    దీనికి నిదర్శనంగా, ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెబుతూ, తన వేలిపై కనిపించే సిరా గుర్తును చూపించారు.

    ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గాఢమైన విశ్వాసం కలిగి ఉన్నామని, భవిష్యత్తుపై ఆశావహ దృక్పథం కలిగినవారమని చెప్పారు.

    వివరాలు 

    మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో జైశంకర్

    భారతదేశంలో ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి వివాదాలు చోటుచేసుకోవని ఆయన స్పష్టం చేశారు.

    మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జైశంకర్, ప్రపంచ ప్రజాస్వామ్యం ప్రస్తుతం సంక్షోభంలో ఉందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ మాట్లాడారు.

    ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల అవసరాలు తీర్చబడటంలేదని ఓ సెనేటర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ, భారత ప్రజాస్వామ్యం 800 మిలియన్ల మందికి పోషకాహార సహాయాన్ని అందిస్తోందని తెలిపారు.

    అయితే, కొన్ని ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు చెప్పారు.

    ప్రజాస్వామ్య వ్యవస్థను అన్ని దేశాల్లో ఒకేలా పోల్చలేమని, భిన్న ప్రాంతాల్లో అది వేర్వేరు రూపాల్లో అనువర్తించబడుతోందని వివరించారు.

    వివరాలు 

    భారత ఎన్నికల వ్యవస్థలో విదేశీ జోక్యం

    భారతదేశం బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగిన దేశమని జైశంకర్ స్పష్టంగా పేర్కొన్నారు.

    దేశంలో రాజకీయ నిరాశావాదం పెరిగిపోయిందనే వాదనలను ఆయన ఖండించారు.

    అంతేకాకుండా, భారత ఎన్నికల వ్యవస్థలో విదేశీ జోక్యం గురించి ప్రస్తావించారు.

    ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు జర్మనీలోని మ్యూనిచ్‌లో 61వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (MSC) జరుగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుబ్రమణ్యం జైశంకర్

    తాజా

    Telegram Update: టెలిగ్రామ్ కొత్త అప్డేట్‌ విడుదల.. యూజర్ల కోసం డైరెక్ట్ మెసేజ్, HD ఫోటో ఫీచర్! టెలిగ్రామ్
    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్.. నిఫ్టీ@24600  స్టాక్ మార్కెట్
    Bombs: జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం నాటి మూడు బాంబులు.. 20వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు జర్మనీ
    New Courses: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటర్ లోనే బీటెక్ సబ్జెక్ట్స్ తెలంగాణ

    సుబ్రమణ్యం జైశంకర్

    మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్ ప్రధాన మంత్రి
    దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు చైనా
    బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    మొజాంబిక్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' రైలులో ప్రయాణించిన జైశంకర్  విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025