Goa Nightclub Fire: గోవా నైట్క్లబ్ అగ్ని కేసు: లూత్రా సోదరుల పాస్పోర్టులు రద్దు..!
ఈ వార్తాకథనం ఏంటి
గోవాలోని నైట్క్లబ్ అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులైన గౌరవ్, సౌరభ్ లూత్రా పాస్పోర్టులను రద్దు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. ఇటీవల చోటుచేసుకున్న ఆ ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత కొన్ని గంటలకే లూత్రా సోదరులు థాయిలాండ్ పారిపోయినట్లు తెలిసింది. వీరు తిరిగి ఎక్కడికీ పారిపోకుండా నిరోధించడానికి, ఇంటర్పోల్ సహాయంతో, దౌత్య మార్గాల ద్వారా వారిని థాయ్లాండ్ నుంచి బహిష్కరించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపారు. గోవా ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రిత్వ శాఖకు లూత్రా సోదరుల పాస్పోర్టులు రద్దు చేయాలని అధికారిక రిక్వెస్ట్లు పంపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నారు.
వివరాలు
తమ ప్రయాణాన్నిముందే ప్లాన్ చేసుకున్నలూత్రా సోదరులు
ఇంటర్పోల్ మంగళవారం వారిపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. సోదరులు ఫుకెట్లో ఉంటారని అనుమానిస్తున్నారు. అర్పోరా క్లబ్, బిర్చ్ బై రోమియో లేన్లో ఆ ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన గంటలకే, డిసెంబర్ 7న తెల్లవారుని 1:17 గంటలకు సోదరులు థాయ్లాండ్కు టికెట్లు బుక్ చేసుకున్నారని వెల్లడించారు. సమయంలో పోలీసులు, ఇతర అత్యవసర బృందాలను మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. అయితే, లూత్రా సోదరులు ముందే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నారని, వృత్తిపరమైన కారణాల కోసం థాయ్లాండ్ వెళ్లారని న్యాయవాది ఢిల్లీలోని రోహిణీ కోర్టుకు తెలిపారు.
వివరాలు
ముందస్తు బెయిల్పై విచారణను గురువారానికి వాయిదా
వారు తక్షణ అరెస్టు నుంచి చట్టపరమైన రక్షణ కోరుతున్నారని తెలిపారు. బుధవారం కోర్టు మధ్యంతర ఉపశమనం ఇవ్వడంలో నిరాకరించింది. ముందస్తు బెయిల్పై విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రమాదం జరిగిన కొద్దిగంటల తర్వాత ఇద్దరు సోదరలు చనిపోయారని.. ఎలాంటి రక్షణ కల్పించొద్దని గోవా పోలీసులు బెయిల్ను వ్యతిరేకించారు. సోదరులు ఇద్దరు భారత్కు వచ్చిన వెంటనే అరెస్టు చేస్తారని భయపడుతున్నారని న్యాయవాది తన్వీర్ అహ్మద్ మీర్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో, బుధవారం గోవా పోలీసులు అగ్ని ప్రమాదం కేసులో అజయ్ గుప్తాను ఢిల్లీ మెజిస్ట్రేట్ ముందు హాజరు చేశారు. వైద్య పరీక్షల అనంతరం విచారణ కోసం గోవాకు తరలించనున్నట్టు తెలిసింది.