NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Godavari Pushkaralu 2027: త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి 
    తదుపరి వార్తా కథనం
    Godavari Pushkaralu 2027: త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి 
    త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి

    Godavari Pushkaralu 2027: త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 10, 2025
    03:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ హిందూ సంప్రదాయంలో నదులు దైవ స్వరూపాలుగా భావించబడతాయి.

    వాటిని పూజించడం, నదుల్లో స్నానాలు చేసి పుణ్యం పొందాలనే ఆచారం ఎన్నో యుగాలుగా నడుస్తూ వస్తోంది.

    ముఖ్యంగా"పుష్కరాలు"అదే కోవలోకి వస్తాయి. దేశవ్యాప్తంగా 12 పవిత్ర నదులకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి.

    బృహస్పతి గ్రహం ఏ రాశిలోకి ప్రవేశిస్తే, దానికి అనుగుణంగా ఆ నదికి పుష్కరాలు నిర్వహించడం సంప్రదాయం.

    ఇందులో భాగంగా,బృహస్పతి సింహ రాశిలోకి ప్రవేశించే సమయంలో గోదావరి నదికి పుష్కరాలు జరుగుతాయి.

    ఈ నేపథ్యంలో,2027లో జూలై 23 నుండి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కర మహోత్సవాలను జరపడానికి సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

    ప్రతి 12 ఏళ్లకూ ఒకసారి జరిగే ఈ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

    వివరాలు 

    2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో ప్రత్యేకతలు 

    ఈసారి జరిగే గోదావరి పుష్కరాలు అనేక విశేషాలతో నిలవనున్నాయని అధికారులు తెలిపారు.

    రాష్ట్ర ప్రభుత్వం అంచనా ప్రకారం,దాదాపు 8కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాల కోసం రానున్నారు.

    ఈ అంచనాకు తగినట్లు ఘాట్ల అభివృద్ధి కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

    2015లో రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల ప్రారంభ వేడుకలో చోటుచేసుకున్న దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని,భక్తుల భద్రత,సౌకర్యాల దృష్ట్యా ఈసారి మరింత సమగ్రంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

    భక్తులు ఒకే ఘాట్‌కు పరిమితం కాకుండా,గోదావరి నదిలో ఏ ప్రాంతంలోనైనా స్నానాలు చేయవచ్చని ప్రచారాన్ని జరిపేందుకు అధికారులు భావిస్తున్నారు.

    ఉభయ గోదావరి జిల్లాల్లోని పుష్కర ఘాట్ల అభివృద్ధికి రాష్ట్ర యంత్రాంగం ₹904కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

    వివరాలు 

    రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ కేటాయింపు 

    అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ₹100కోట్ల నిధులను ముందస్తుగా కేటాయించింది.

    గోదావరి పుష్కరాల సందర్బంగా రైల్వే శాఖ కూడా విశేష చర్యలు చేపట్టింది.

    రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి ₹271.43 కోట్ల నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

    దేశంలోని వివిధ ముఖ్య కేంద్రాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

    ఈ రైళ్ల వివరాలను ముందుగానే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

    వివరాలు 

    పుష్కరాల ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష 

    2027 పుష్కరాల కోసం "అఖండ గోదావరి పుష్కరాలు" పేరుతో ముసాయిదా యాక్షన్ ప్లాన్ రూపొందించబడింది.

    ప్రస్తుతం ఏపీలో గోదావరి నది తీరంలోని 17 ప్రధాన ఘాట్లకు రోజూ సగటున 75 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.

    రాజమండ్రిలో ఉన్న ఘాట్లకు అదనంగా నలుగు కొత్త ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.

    రాజమహేంద్రవరం పరిధిలోని ఘాట్ల అభివృద్ధికి ప్రత్యేకంగా ₹904 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించబడింది.

    వివరాలు 

    రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి కూడా నిధుల ప్రణాళిక 

    కార్పొరేషన్ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి ₹456.5 కోట్లతో, ఆర్‌అండ్‌బీ (రహదారి, భవనాలు) శాఖ ద్వారా రహదారులు, వంతెనల నిర్మాణానికి ₹678.76 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు.

    మొత్తంగా చూస్తే, గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమిష్టిగా ప్రణాళికలు రూపొందిస్తూ, తగిన నిధుల సమీకరణకు సన్నద్ధమవుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Godavari Pushkaralu 2027: త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి  ఆంధ్రప్రదేశ్
    Foreign trips: భారతీయ పర్యాటకులకు శుభవార్త.. తక్కువ బడ్జెట్‌తో విదేశీ యాత్రలివే! థాయిలాండ్
    Nothing Phone 3 : అద్భుత ఫీచర్లతో నథింగ్ 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే? స్మార్ట్ ఫోన్
    Anti-ICE protest: అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో జోరందుకున్న 'యాంటీ ఐస్‌' ఆందోళనలు..! అమెరికా

    ఆంధ్రప్రదేశ్

    Andhra News: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా.. మార్గదర్శకాలు విడుదల భారతదేశం
    Ponguru Narayana: రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ  భారతదేశం
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక భారీ వర్షాలు
    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025