NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు
    భారతదేశం

    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు

    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 22, 2022, 03:44 pm 1 నిమి చదవండి
    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు
    కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్న జాతీయ కమిటీ

    ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తూ, పీఎఫ్‌ జీతంలో కట్ అవుతున్నవారికి ఇది శుభవార్త. నెలవారీ పెన్షన్‌ను రూ.1,000 నుండి రూ.7,500కి పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖకు EPS-95 జాతీయ కమిటీ 15 రోజుల నోటీసు ఇచ్చింది. ఒకవేళ ఈ డిమాండ్‌ను నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని బెదిరించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ EPS-95ని రిటైర్మెంట్ ఫండ్ సంస్థ EPFO నిర్వహిస్తూ ఆరు కోట్ల మంది చందాదారులు, 75 లక్షల మంది పెన్షనర్లకు సేవలందిస్తుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు సోమవారం రాసిన లేఖలో ఈ కమిటీ ఈపీఎస్-95 పెన్షనర్ల మరణాలు తక్కువ పెన్షన్, వైద్య సదుపాయాల కొరత కారణంగా పెరుగుతున్నాయని పేర్కొంది.

    డిమాండ్లు నెరవేర్చకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరిక

    15 రోజులలోపు కనీస పెన్షన్‌ను పెంచకపోతే రైలు, రోడ్డు మార్గాలను దిగ్బంధించి దేశవ్యాప్త ఆందోళనను చేస్తామని బెదిరించింది. నిర్ణీత వ్యవధిలో డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కి పెంచాలని కమిటీ డిమాండ్ చేసింది. అక్టోబర్ 4, 2016, నవంబర్ 4, 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వాస్తవ జీతంపై పెన్షన్ చెల్లించాలని కూడా కోరింది. పెన్షనబుల్ జీతం కోసం ప్రస్తుత థ్రెషోల్డ్ నెలకు రూ.15,000. ఈ స్కీమ్‌లో చేర్చని రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో సభ్యులుగా చేయడం ద్వారా EPS-95 కవరేజీని విస్తరించాలని కమిటీ డిమాండ్ చేసింది. 2012-2013లో కోషియారీ కమిటీ సిఫార్సుల మేరకు కనీస పెన్షన్‌ పెంపుదల జరిగింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    వ్యాపారం

    తాజా

    రాజస్థాన్‌: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్ రాజస్థాన్
    మార్చి 25న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఏజెంట్ సెకండ్ సింగిల్: తెలంగాణ యాసతో రొమాంటిక్ టచ్, అదరగొట్టేసారు తెలుగు సినిమా
    యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా గూగుల్ మ్యాప్స్‌ని ఇలా ఉపయోగించచ్చు గూగుల్

    భారతదేశం

    భారతదేశంలో 23,500 బుకింగ్‌లను దాటిన మారుతీ-సుజుకి Jimny ఆటో మొబైల్
    గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ లోక్‌సభ
    IPL 2023 ప్రారంభానికి ముందే అపరిమిత క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించిన రిలయన్స్ జియో జియో
    భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలని పెంచే ఆలోచనలో మెర్సిడెస్-బెంజ్ ఆటో మొబైల్

    వ్యాపారం

    తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరిస్తోన్న BYJU'S ప్రకటన
    తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ ప్రకటన
    క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు క్రిప్టో కరెన్సీ
    విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ సీబీఐ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023