NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు
    తదుపరి వార్తా కథనం
    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు
    కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్న జాతీయ కమిటీ

    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 22, 2022
    03:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తూ, పీఎఫ్‌ జీతంలో కట్ అవుతున్నవారికి ఇది శుభవార్త.

    నెలవారీ పెన్షన్‌ను రూ.1,000 నుండి రూ.7,500కి పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖకు EPS-95 జాతీయ కమిటీ 15 రోజుల నోటీసు ఇచ్చింది. ఒకవేళ ఈ డిమాండ్‌ను నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని బెదిరించింది.

    ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ EPS-95ని రిటైర్మెంట్ ఫండ్ సంస్థ EPFO నిర్వహిస్తూ ఆరు కోట్ల మంది చందాదారులు, 75 లక్షల మంది పెన్షనర్లకు సేవలందిస్తుంది.

    కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు సోమవారం రాసిన లేఖలో ఈ కమిటీ ఈపీఎస్-95 పెన్షనర్ల మరణాలు తక్కువ పెన్షన్, వైద్య సదుపాయాల కొరత కారణంగా పెరుగుతున్నాయని పేర్కొంది.

    EPS-95

    డిమాండ్లు నెరవేర్చకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరిక

    15 రోజులలోపు కనీస పెన్షన్‌ను పెంచకపోతే రైలు, రోడ్డు మార్గాలను దిగ్బంధించి దేశవ్యాప్త ఆందోళనను చేస్తామని బెదిరించింది. నిర్ణీత వ్యవధిలో డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కి పెంచాలని కమిటీ డిమాండ్ చేసింది.

    అక్టోబర్ 4, 2016, నవంబర్ 4, 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వాస్తవ జీతంపై పెన్షన్ చెల్లించాలని కూడా కోరింది. పెన్షనబుల్ జీతం కోసం ప్రస్తుత థ్రెషోల్డ్ నెలకు రూ.15,000.

    ఈ స్కీమ్‌లో చేర్చని రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో సభ్యులుగా చేయడం ద్వారా EPS-95 కవరేజీని విస్తరించాలని కమిటీ డిమాండ్ చేసింది. 2012-2013లో కోషియారీ కమిటీ సిఫార్సుల మేరకు కనీస పెన్షన్‌ పెంపుదల జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    భారతదేశం

    రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే సినిమా
    మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025