NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP DSC: ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. నిబంధనల్లో సడలింపులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP DSC: ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. నిబంధనల్లో సడలింపులు
    ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. నిబంధనల్లో సడలింపులు

    AP DSC: ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. నిబంధనల్లో సడలింపులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 29, 2025
    09:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇటీవల విడుదలైన డిఎస్సీ నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారిన పలు నిబంధనలను సవరించే నిర్ణయం తీసుకుంది.

    ఈ మేరకు మంత్రి నారా లోకేష్‌ "ఎక్స్‌" ద్వారా ప్రకటన విడుదల చేశారు. డిఎస్సీ దరఖాస్తు సమయంలోనే అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలన్న నిబంధన అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.

    ముఖ్యంగా కుల ధృవీకరణ, నివాస ధృవీకరణ వంటి పత్రాల కోసం ప్రిపరేషన్ సమయానికే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లడంతో, దరఖాస్తు సమయంలో సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ను ఆప్షనల్‌గా చేస్తూ మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

    Details

    అర్హత కోల్పోయిన లక్షలాది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనే అవకాశం

    ఇకపై అసలు ధ్రువీకరణ పత్రాలను సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పిస్తే చాలని స్పష్టంగా చెప్పారు.

    ఇక అర్హత మార్కుల విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    మొదట విడుదలైన నోటిఫికేషన్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 45-50 శాతం మార్కులు తప్పనిసరి అని పేర్కొనగా, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు 40 శాతం మార్కులే సరిపోతాయని మార్పు చేశారు.

    ఈ నిర్ణయంతో గతంలో అర్హత కోల్పోయిన లక్షలాది అభ్యర్థులకు డిఎస్సీకి దరఖాస్తు చేసే అవకాశం లభించింది.

    Details

    ఫిజిక్స్‌, కెమిస్ట్రీ టీచర్ పోస్టుల విషయంలో అనేక సందేహాలు

    అయితే డిఎస్సీ నోటిఫికేషన్‌లోని కొన్ని అర్హత నిబంధనలు అభ్యర్థుల్లో మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి.

    ముఖ్యంగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ టీచర్ పోస్టుల విషయంలో అనేక సందేహాలు నెలకొన్నాయి.

    బిసిఏ (BCA) అభ్యర్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదవకపోయినా అవకాశం ఇవ్వడం, అయితే బిఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులను అనుమతించకపోవడం అభ్యర్థుల అసంతృప్తికి కారణమైంది.

    బిఎస్సీ కంప్యూటర్స్‌లో కెమిస్ట్రీ స్థానంలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉండేందున, వారిని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నారా లోకేశ్
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Kidambi Srikanth: జపాన్ ఆటగాడిపై గెలిచిన శ్రీకాంత్.. ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్ బ్యాడ్మింటన్
    Theatres bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్ టాలీవుడ్
    India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక శుభమన్ గిల్
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు

    నారా లోకేశ్

    Land Titling Act: చంద్రబాబు, నారా లోకేష్‌లపై సీఐడీ కేసు నమోదు  చంద్రబాబు నాయుడు
    Nara Lokesh: జనానికి అందుబాటులో లోకేష్.. గతానికి భిన్నంగా పని తీరు భారతదేశం
    Nara Lokesh: ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్.. మెగా డీఎస్సీ ఫైలుపై తోలి సంతకం  భారతదేశం
    Foxconn: మాన్యుఫ్యాక్చరింగ్ సిటీ అభివృధికి ఫాక్స్‌కాన్ అంగీకారం.. ఫాక్స్‌కాన్‌ బృందంతో లోకేశ్‌  సమావేశం   భారతదేశం

    ఆంధ్రప్రదేశ్

    AP Inter Results 2025: ఏపీ ఇంటర్‌ ఫలితాల విడుదల.. పరీక్ష ఫలితాలను ఇక్కడ చూడండి! ఇంటర్
    IAS : ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఎనిమిది మందికి పోస్టింగ్ మార్పు ఇండియా
    AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.. సీఆర్డీఏ ఆథారిటీ చర్చించిన అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. భారతదేశం
    AndhraPradesh: ఏపీలో చేపల వేటపై నిషేధం రెండు నెలల పాటూ వేట బంద్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025