NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా
    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా
    భారతదేశం

    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా

    వ్రాసిన వారు Naveen Stalin
    April 11, 2023 | 02:47 pm 0 నిమి చదవండి
    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా
    ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్రం అంచనా

    ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్రం వెల్లడించింది. సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం 67 శాతం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసినట్లు కేంద్రం పేర్కొంది. భారతదేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) సాధారణ వర్షపాతం నమోదవుతుందని, ఇది దాదాపు 87 సెంటీమీటర్ల దీర్ఘకాల సగటులో 96 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రవిచంద్రన్ తెలిపారు.

    జూన్ 1 నాటికి కేరళలోకి ప్రవేశించినున్న రుతుపవనాలు

    భారతదేశం అంతటా కోట్లాది మంది రైతులు తమ పొలాలను వార్షిక రుతుపవనాలపై ఆధారపడి సాగు చేసుకుంటారు. ఐఎండీ అంచనా వేసినట్లు వర్షాలు పడితే వరి, సోయాబీన్స్, మొక్కజొన్న, చెరకు వంటి పంటల ఉత్పత్తి పెరుగుతుంది. ఆహార ధరలు తగ్గడానికి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉండటానికి దోహదపడుతుంది. రుతుపవనాల సీజన్‌లో ఎల్‌నినో పరిస్థితులు అభివృద్ధి చెందే అవకాశం ఉందని, దాని ప్రభావం ద్వితీయార్ధంలో ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. అన్ని ఎల్ నినోలు చెడ్డవి కావని పేర్కొంది. ఎల్ నినో అనేది మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితలం వేడెక్కే దశను సూచిస్తుంది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ దక్షిణ కొనపై కురిసే వర్షాలు, సెప్టెంబర్ నాటికి తిరోగమనం చెందుతాయని ఐఎండీ చెప్పింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఐఎండీ
    భారతదేశం
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ఐఎండీ

    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్
    తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ తెలంగాణ
    తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ తెలంగాణ
    బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే పశ్చిమ బెంగాల్

    భారతదేశం

    మేఘాలయలోని సిజు గుహలో కొత్తజాతి కప్పలను కనుగొన్న శాస్త్రవేత్తలు ప్రపంచం
    డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన  చైనా
    2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్ ఐఎంఎఫ్
    రష్యా చమురు భారతదేశం ద్వారా యూరప్‌లోకి బ్యాక్‌డోర్‌ ద్వారా ప్రవేశం ఆటో మొబైల్

    తాజా వార్తలు

    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్
    అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్!  పంజాబ్
    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    విమానాల్లో వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులపై చర్యలకు 'డీజీసీఏ' కీలక సూచనలు  విమానం

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    అమృత్‌పాల్ సింగ్ మెంటర్ పాపల్ ప్రీత్ సింగ్ అరెస్ట్  పంజాబ్
    కరోనా భయాలు: దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ కోవిడ్
    దేశంలో కొత్తగా 5,880 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 6.91శాతం కరోనా కొత్త కేసులు
    రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు? రాహుల్ గాంధీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023