NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Special Trains: రైలు ప్రయాణీకులకు శుభవార్త.. దసరా,దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు 
    తదుపరి వార్తా కథనం
    Special Trains: రైలు ప్రయాణీకులకు శుభవార్త.. దసరా,దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు 
    రైలు ప్రయాణీకులకు శుభవార్త

    Special Trains: రైలు ప్రయాణీకులకు శుభవార్త.. దసరా,దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 12, 2024
    08:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బతుకుదెరువు కోసం చాలా మంది తమ సొంత ఊరును వదిలి నగరాలకు వచ్చి జీవనం కొనసాగించడం ఈ రోజుల్లో సాధారణంగా మారింది.

    ముఖ్యంగా అవసరమైన పనుల కోసం లేదా పండుగ సందర్భాల్లో సొంత ఊర్లకు వెళ్లే సమయంలో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

    పండుగ సమయాల్లో తమ ఊర్లకు చేరేందుకు అధిక రుసుములు చెల్లించి ప్రయాణం చేయాల్సి వస్తుంది.

    ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల సమయంలో బస్సులు, రైళ్లు ప్రయాణికులతో నిండిపోతాయి.

    ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే, రాబోయే దసరా, దీపావళి పండుగ రోజులలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

    ఈ ప్రత్యేక రైళ్ల పూర్తి వివరాలు చూస్తే..

    వివరాలు 

     అక్టోబర్ 5 నుండి నవంబర్ 12 వరకు ఒక్కో మార్గంలో ఆరు ట్రిప్పులు

    దక్షిణ మధ్య రైల్వే మొత్తం 24ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

    దసరా,దీపావళి పండుగల సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి తగిన విధంగా,ఈ రైలు సర్వీసులు అక్టోబర్ 5 నుండి నవంబర్ 12 వరకు ఒక్కో మార్గంలో ఆరు ట్రిప్పుల చొప్పున నడుస్తాయి.

    సికింద్రాబాద్‌-తిరుపతి రైలు అక్టోబర్ 5 నుండి నవంబర్ 9 వరకు ప్రతి శనివారం నడవనుంది, తిరుపతి-సికింద్రాబాద్‌ రైలు అక్టోబర్ 8 నుండి నవంబర్ 12 వరకు ప్రతి మంగళవారం నాడు ప్రయాణిస్తుంది.

    అలాగే, తిరుపతి-శ్రీకాకుళం రోడ్‌ రైలు అక్టోబర్ 6 నుండి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం నడవనుంది, శ్రీకాకుళం రోడ్‌-తిరుపతి రైలు అక్టోబర్ 7 నుండి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ సికింద్రాబాద్
    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు ధర్మవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025