NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. ఏడు పట్టణాల్లో స్వశక్తి భవనాలు
    తదుపరి వార్తా కథనం
    Telangana: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. ఏడు పట్టణాల్లో స్వశక్తి భవనాలు
    మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. ఏడు పట్టణాల్లో స్వశక్తి భవనాలు

    Telangana: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. ఏడు పట్టణాల్లో స్వశక్తి భవనాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 16, 2024
    10:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సంగారెడ్డి జిల్లాలోని మహిళా పొదుపు సంఘాలకు సొంత భవనాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

    ఈ సంఘాల సభ్యులు, గ్రామ్య సంఘాలకు భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధించేవారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహించబడుతున్నాయి.

    స్వశక్తి సంఘాలు ఏర్పడినప్పటి నుంచి సొంత భవనాలు లేవు. ప్రతినెలా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడానికి సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

    స్వశక్తి భవనాలు అందుబాటులో లేక, వారు చెట్ల కింద, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు వంటి ప్రాంతాలలో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

    పురపాలక కార్యాలయాల్లో ఓ గదిని కేటాయించినప్పటికీ, అది వారి అవసరాలకు సరిపోవడం లేదు.

    వివరాలు 

    అన్ని పట్టణాల్లో స్వశక్తి భవనాలకు స్థలాలు కేటాయించాలని నిర్ణయం 

    జిల్లాలోని అన్ని పట్టణాల్లో సమావేశాలు,ఇతర కార్యక్రమాల కోసం స్వశక్తి భవనాలు నిర్మించాలనే కోరుతూ, మహిళా సభ్యులు, ప్రజాప్రతినిధులు ఏళ్లుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

    పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అన్ని పట్టణాల్లో స్వశక్తి భవనాలకు స్థలాలు కేటాయించాలని నిర్ణయించింది.

    పురపాలికల్లో అవసరమైన స్థలాలను సేకరించాలని ఆదేశాలు జారీచేసింది. స్థల సేకరణ పూర్తైన తర్వాత, భవన నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తారు.

    వివరాలు 

    500 గజాల స్థలం అవసరం 

    స్వశక్తి భవనాలు సంగారెడ్డి మినహా ఏడు పురపాలక సంఘాలకు మంజూరు అయ్యాయి. సంగారెడ్డికి 12 సంవత్సరాల క్రితమే మంజూరు చేసినప్పటికీ, ఇప్పటివరకు నిర్మాణం పూర్తికాలేదు.

    మిగతా పురపాలికల్లో కమిషనర్లు, రెవెన్యూ అధికారులతో కలిసి 500 గజాల స్థలం సేకరించాల్సి ఉంటుంది.

    రెండు నెలల్లో స్థల సేకరణ పూర్తయితే, భవన నిర్మాణానికి ఇంజినీర్లతో ప్రతిపాదనలు తయారు చేయించాలి.

    మెప్మా ఉన్నతాధికారులకు నివేదికలు పంపితే, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తారు. మహిళా సంఘాల భవనాల కోసం స్థల సేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు డీఎంసీ మల్లీశ్వరి తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప
    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ

    తెలంగాణ

    TGSRTC: భారీ వర్షాల నేపథ్యంలో.. తెలంగాణలో 1400 బస్సులు రద్దు  భారతదేశం
    Telangana: భారీ వర్షాలు,వరదలకు తెలంగాణలో రూ.5వేల కోట్ల నష్టం: రేవంత్  భారతదేశం
    Telangana: మూడు రోజులుగా భారీ వర్షాలు.. తెలంగాణ ప్రాజెక్టులకు భారీ వరద ప్రవాహం  భారతదేశం
    Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రానికి నిలిచిపోయిన రాకపోకలు ఛత్తీస్‌గఢ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025