NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra News: ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఏపీ సర్కార్‌ పచ్చజెండా.. మార్చి నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశాలు
    తదుపరి వార్తా కథనం
    Andhra News: ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఏపీ సర్కార్‌ పచ్చజెండా.. మార్చి నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశాలు
    ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఏపీ సర్కార్‌ పచ్చజెండా

    Andhra News: ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఏపీ సర్కార్‌ పచ్చజెండా.. మార్చి నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 26, 2024
    08:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల ఫీజులు వసూలుచేసి ప్రజలను అప్పులపాలు చేసిన లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌)పై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.

    పెండింగ్‌ దరఖాస్తులను మార్చి నెలాఖరులోగా పరిష్కరించి ప్రజల బాధలు తీర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు జారీచేసింది.

    వివరాలు 

    పెండింగ్‌ దరఖాస్తులపై తాఖీదులు

    పట్టణాభివృద్ధి సంస్థల్లో పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై మరల తాఖీదులు జారీ చేయనున్నారు.

    దరఖాస్తుదారుల నుంచి అదనపు సమాచారం, అవసరమైన పత్రాలు, చెల్లించాల్సిన ఫీజుల వివరాలపై నోటీసులు సిద్ధం చేస్తున్నారు.

    గతంలో కూడా నోటీసులు పంపినా ప్రజల నుంచి సరైన స్పందన రాలేదని అధికారులు పేర్కొన్నారు.

    లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల సహాయంతో మొదట ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, నోటీసులు అందుకున్నప్పటికీ చాలామంది స్పందించలేదు.

    అదనపు సమాచారం పంపడంలో సర్వేయర్ల భాగస్వామ్యం తక్కువగా ఉండటంతో, దరఖాస్తులు అపరిష్కృతంగా ఉండిపోయాయి.

    తాజా ఆదేశాల ప్రకారం, దరఖాస్తుదారుల చిరునామాలకు పోస్టుల ద్వారా నోటీసులు పంపించనున్నారు.

    ఫోన్‌ ద్వారా సమాచారం అందించి, అదనపు పత్రాలు సమర్పించిన వారి దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది.

    వివరాలు 

    ప్రత్యేక ఖాతాల్లో నిధుల కొరత

    గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన రూ.470 కోట్ల ఆదాయాన్ని ఇతర అవసరాలకు మళ్లించింది.

    ఈ నిధులను ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో జమచేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆ నియమాన్ని పాటించలేదు.

    దీంతో క్రమబద్ధీకరణ ఫీజుల ద్వారా పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశం నెరవేరలేదు.

    విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ వంటి ప్రాంతాల్లో వచ్చిన ఆదాయం పూర్తి స్థాయిలో వాడిపోయారు.

    వివరాలు 

    సమీక్షలు లేకపోవడం, ఆదేశాల లోపం

    గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారంపై సరైన సమీక్షలు చేయలేదు.

    ఫీజుల వసూళ్ల కోసం నోటీసులు పంపించడమే తప్ప, మంత్రిత్వస్థాయిలో సమీక్షలు జరపలేదు.

    పరిష్కరించామనే 30 వేల దరఖాస్తులలోనూ అనేక దోషాలు ఉన్నాయి.

    రికార్డుల్లో పరిష్కారంగా చూపించిన చాలా దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

    దీనిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని, వినతుల స్వీకరణకు ప్రత్యేక మేళాలను నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆంధ్రప్రదేశ్

    Textile sector: వస్త్ర రంగానికి ఊతమిచ్చే కొత్త పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు  ప్రభుత్వం
    Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్‌ వ్యవస్థ.. విద్యా ప్రమాణాలపై మంత్రి లోకేశ్ ఫోకస్  నారా లోకేశ్
    Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు.. రుణసాయం ఒప్పందానికి ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఆమోదం  భారతదేశం
    Rain Alert : బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం.. నేడూ స్కూళ్లకు సెలవు   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025