
Amaravati: అమరావతిలో గూగుల్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. 143 ఎకరాల భూమి కేటాయించనున్న ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గూగుల్ సంస్థ భారీ ప్రాజెక్ట్ను ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది.
ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో కీలకమైన చర్చలు కొనసాగిస్తోంది.
ఈ ప్రాజెక్టును అమరావతిలో ప్రారంభించేందుకు గూగుల్ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వం అనంతవరం-నెక్కల్లు మధ్యలోని ఈ-8 రోడ్డు పక్కన ఉన్న సర్వే నంబర్లు 10, 12, 13, 15, 16ల్లో మొత్తం 143 ఎకరాల భూమిని గూగుల్కు కేటాయించేందుకు సిద్ధమైంది.
Details
నెక్కల్లు ప్రాంతంలో స్థల పరిశీలన
శుక్రవారం గూగుల్ ప్రతినిధులు, సీఆర్డీఏ (CRDA) అధికారులు కలిసి నెక్కల్లు ప్రాంతాన్ని సందర్శించి భూసర్వే, స్థల పరిశీలన చేపట్టారు.
అమరావతిలో గూగుల్ ప్రారంభించబోయే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అటు ఉపాధి అవకాశాలు, ఇటు పెట్టుబడుల ప్రవాహానికి మార్గం వేయనుందని భావిస్తున్నారు.
ఇక ఈ స్థలానికి సమీపంలోనే రానున్న అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్ వంటి కీలక సదుపాయాల నేపథ్యంలో గూగుల్ సంస్థ ప్రతినిధులు ఇదే స్థలాన్ని ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్టుతో అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు దక్కనుండగా, ఆంధ్రప్రదేశ్లో టెక్ రంగ అభివృద్ధికి ఇది పెద్ద పురోగమనే విశ్లేషణ కొనసాగుతోంది.