NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Google: విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఏఐ సేవలు.. ఏపీ ప్రభుత్వంతో గూగుల్‌ ప్రతినిధుల కీలక ఒప్పందం 
    తదుపరి వార్తా కథనం
    Google: విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఏఐ సేవలు.. ఏపీ ప్రభుత్వంతో గూగుల్‌ ప్రతినిధుల కీలక ఒప్పందం 
    ఏపీ ప్రభుత్వంతో గూగుల్‌ ప్రతినిధుల కీలక ఒప్పందం

    Google: విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఏఐ సేవలు.. ఏపీ ప్రభుత్వంతో గూగుల్‌ ప్రతినిధుల కీలక ఒప్పందం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 06, 2024
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, సెల్‌ఫోన్‌ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.

    ప్రజల జీవన శైలిని మెరుగుపరచడమే 'ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌' విధాన లక్ష్యమని పేర్కొన్నారు.

    రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగానికి, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ

    ఒప్పందానికి సచివాలయంలో గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా ఉపాధ్యక్షుడు బిక్రమ్‌సింగ్‌ బేడి, ఏపీ రియల్‌టైం గవర్నెన్స్‌ శాఖ కార్యదర్శి సురేష్‌కుమార్‌ సంతకాలు చేశారు.

    వివరాలు 

    స్టార్టప్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడం

    ఈ ఒప్పందం ద్వారా సంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు మౌలిక వనరులు లభిస్తాయి.

    మంత్రి పేర్కొన్నట్లుగా, యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్తు అవకాశాలు కల్పించడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుందని, ఆధునాతన సాంకేతికతను ప్రజల జీవితాల్లోకి తీసుకురావడమే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు.

    స్టార్టప్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు, వాటి ప్రయోజనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే గూగుల్‌ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

    పాలనలో కృత్రిమ మేధ వినియోగం ద్వారా వేగవంతమైన, మెరుగైన సేవలు అందించాలన్న ప్రభుత్వ ఆశయానికి ఈ ఒప్పందం బలాన్నిస్తుందని గూగుల్‌ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

    వివరాలు 

    ఒప్పందంలోని ముఖ్యాంశాలు

    విద్యా, నైపుణ్యాభివృద్ధి: విద్యార్థులు, డెవలపర్లకు ఏఐ ఆధారిత నైపుణ్యాల శిక్షణ కోసం 10 వేల మందికి గూగుల్‌ శిక్షణ అందిస్తుంది. రోజువారి జీవితంలో ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడం, ఉత్పాదకత పెంచడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుంది. సైబర్‌ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్‌ వంటి విభాగాల్లో గూగుల్‌ సహకారం అందిస్తుంది.

    స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌: స్టార్టప్‌ల అభివృద్ధికి గూగుల్‌ మెంటార్‌షిప్‌, నెట్‌వర్కింగ్‌ అవకాశాలు కల్పిస్తుంది. అర్హత కలిగిన స్టార్టప్‌లకు క్లౌడ్‌ క్రెడిట్స్‌, సాంకేతిక శిక్షణ అందిస్తుంది.

    సుస్థిరత: గాలి నాణ్యత, పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో గూగుల్‌ సహకరిస్తుంది.

    వైద్య సేవల అభివృద్ధి: ఆరోగ్య సంరక్షణ సేవల మెరుగుదలకు, రోగ నిర్ధారణ వేగవంతం చేయడానికి గూగుల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది.

    వివరాలు 

    గూగుల్‌తో ఒప్పందం ఓ గొప్ప ముందడుగు: చంద్రబాబు  

    ఏఐ పైలట్‌ ప్రాజెక్టులు:వ్యవసాయం,ట్రాఫిక్‌ నిర్వహణ,వెబ్‌సైట్‌ ఆధునికీకరణ,పౌర ఫిర్యాదుల పరిష్కారం వంటి రంగాల్లో పైలట్‌ ప్రాజెక్టులకు గూగుల్‌ క్లౌడ్‌ సాంకేతికత అందిస్తుంది.

    ఈ ఒప్పందం ద్వారా కృత్రిమ మేధ రంగంలో ఆవిష్కరణలకు దారులు తెరవడంతో పాటు, ప్రభుత్వం తలపెట్టిన రియల్‌టైమ్‌ పాలనకు మద్దతు లభిస్తుంది.

    ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం,గూగుల్‌ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్ప ముందడుగుగా అభివర్ణించారు.

    ఈ సందర్భంగా,ఉండవల్లిలోని తన నివాసంలో గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా ఉపాధ్యక్షుడు,కంట్రీ ఎండీ బిక్రమ్‌సింగ్‌ బేడి సహా సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు.

    ఈ భేటీకి ముందు,లోకేశ్‌ సమక్షంలో ఒప్పందానికి సంబంధించిన పత్రాలపై చర్చలు జరిగాయి.

    ఇందులో భాగంగా,గూగుల్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    గూగుల్

    తాజా

    operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌లో మా సైనికులు 11 మంది చనిపోయారు: పాక్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Sunil Gavaskar: 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌, విరాట్‌ ఆడరు: సునీల్‌ గావస్కర్‌ సునీల్ గవాస్కర్
    CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకొండి ఇలా.. సీబీఎస్‌ఈ
    China: వేధింపులు, ఆధిపత్య ధోరణితో ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అవుతారు: జిన్‌పింగ్‌ జిన్‌పింగ్

    ఆంధ్రప్రదేశ్

    Andhra pradesh: 700 నోటీసులు,147 కేసులు,49 అరెస్టులు.. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు.. అసలేం జరుగుతోంది? భారతదేశం
    Ntr Bharosa Pensions: కొత్త పెన్షన్‌దారుల కోసం కీలక ప్రకటన.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచంటే.. భారతదేశం
    Hyderabad: గాడిద పాల పేరిట కుంభకోణం.. రూ.100 కోట్లు నష్టపోయిన బాధితులు తెలంగాణ
    Bharat Forge: రక్షణ రంగంలో రాష్ట్రానికి భారీ ప్రాజెక్టు.. కేఎస్‌ఎస్‌ఎల్‌ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన భారతదేశం

    గూగుల్

    Google: ఆండ్రాయిడ్ డివైజ్‌లలో డెడికేటెడ్ సెర్చ్ బటన్‌ను తొలగించాలన్న గూగుల్  టెక్నాలజీ
    Google: Chrome డేటా సేకరణపై Google దావాను ఎదుర్కొంటుంది: US కోర్టు  టెక్నాలజీ
    Youtube: యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ అయిందా? రికవరీ కోసం గూగుల్ కొత్త AI టూల్‌ వచ్చేసింది! యూట్యూబ్
    Co-Lead Gemini: జెమిని AIకి సహయకుడిగా నోమ్ షజీర్ టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025