NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP MIG: మధ్య తరగతి కుటుంబాలకు ప్లాట్ల కేటాయింపులో ప్రభుత్వం కీలక నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    AP MIG: మధ్య తరగతి కుటుంబాలకు ప్లాట్ల కేటాయింపులో ప్రభుత్వం కీలక నిర్ణయం
    మధ్య తరగతి కుటుంబాలకు ప్లాట్ల కేటాయింపులో ప్రభుత్వం కీలక నిర్ణయం

    AP MIG: మధ్య తరగతి కుటుంబాలకు ప్లాట్ల కేటాయింపులో ప్రభుత్వం కీలక నిర్ణయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 17, 2024
    01:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    ఎంఐజీ లేఅవుట్లలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది.

    గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని అసంపూర్తిగా విడిచిపెట్టినప్పటికీ, ఇప్పుడు కొత్త ప్రణాళికతో ముందుకెళ్లాలని ప్రభుత్వం చూస్తోంది.

    ఇప్పటికే వాయిదా మొత్తాలు చెల్లించిన వారికి నష్టపోకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

    Details

    ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌ పేరు మార్పు

    గత ప్రభుత్వం హాయంలో పట్టణాల్లో 175 లేఅవుట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

    ఇక రాష్ట్రవ్యాప్తంగా కేవలం 36 లేఅవుట్లకే పరిమితమైంది.

    రోడ్లు, తాగునీరు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఆసక్తి చూపలేదు.

    ప్రస్తుతం ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లకు సంబంధించిన పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించింది.

    ఇక జగన్ స్మార్ట్ టౌన్‌షిప్ పేరు మార్చి ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌గా ప్రకటించారు

    Details

    త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ

    వాయిదా మొత్తం చెల్లించిన లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి, త్వరలో రిజిస్ట్రేషన్ పూర్తిచేసి వారికి ప్లాట్లను అప్పగించనున్నారు.

    ఇంకా వాయిదాలు చెల్లించాల్సిన దరఖాస్తుదారుల నుంచి పెండింగ్ మొత్తాలను వసూలు చేసి, లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేపట్టనున్నారు.

    విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, రాజమహేంద్రవరం, కాకినాడ వంటి ప్రధాన పట్టణాల్లో ఎంఐజీ లేఅవుట్లకు మంచి స్పందన లభించింది.

    అయితే పనుల నిర్వహణలో జాప్యం కారణంగా దరఖాస్తుదారుల్లో కొందరు వెనక్కి వెళ్లారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    ఆంధ్రప్రదేశ్

    #Newsbytesexplainer: భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం.. 9 మంది మృతి  భారీ వర్షాలు
    Effect of heavy rains: ఆంధ్రా, తెలంగాణలో వర్షాల బీభత్సం.. 19 మంది మృతి, 140 రైళ్లు రద్దు  తెలంగాణ
    Prakasm Barrage: ఏపీని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీపై రెండో ప్రమాద హెచ్చరిక జారీ భారీ వర్షాలు
    Heavy rains: ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాల ఎఫెక్టు.. రైల్వే ట్రాక్ కొట్టుకుపోయి పలు రైళ్లు రద్దు  భారీ వర్షాలు

    ప్రభుత్వం

    హైదరాబాద్లో 2BHK ఇళ్ల పంపకానికి రంగం సిద్ధం.. దశల వారీగా 75 వేళ ఇళ్ల పంపిణీ తెలంగాణ
    ఎన్నికల వేళ తెలంగాణలో కీలక నిర్ణయం..మరోసారి ఆసరా పెన్షన్ల పెంపు దిశగా సర్కార్ తెలంగాణ
    DSC Notification: గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్   తెలంగాణ
    Patnam Mahender reddy: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025