
Ethanol: చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిపై ఉన్న నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం..
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తి విధానంలో కీలక మార్పులు చేసింది. చెరకుతో ఇథనాల్ తయారీపై విధించిన నిషేధాన్ని రద్దు చేసింది.
ఈ విషయం గురువారం ఒక నోటిఫికేషన్ ద్వారా తెలిపింది.ఈ మార్పు చెరకు రైతులు,చక్కెర మిల్లులు, స్టాక్ మార్కెట్లోని చక్కెర కంపెనీలకు ఆనందదాయకమైన వార్త అని చెప్పవచ్చు.
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ 2024-25 ఇథనాల్ సరఫరా సంవత్సరానికి ఈ మార్పును అమలు చేయనుంది.
1 నవంబర్ 2024 నుండి ఇది అమలులోకి రాబోతోంది. చక్కెర మిల్లులు ఇప్పుడు చెరకు రసం, చక్కెర సిరప్ నుండి ఇథనాల్ తయారు చేయడానికి అనుమతిని పొందాయి.
గతంలో, ఈ పరిమితి ఉండగా, ఇప్పుడు ఈ పరిమితి తొలగించడం జరిగింది.
వివరాలు
ఇథనాల్ ఉత్పత్తి కోసం బియ్యాన్ని కొనుగోలు చేయడానికి డిస్టిలరీలకు ప్రభుత్వం అనుమతి
అంతేకాకుండా, ఇథనాల్ ఉత్పత్తికి బి-హెవీ, సి-హెవీ మొలాసిస్ల వినియోగాన్ని కూడా ప్రభుత్వం ఆమోదించింది.
2024-25 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో,చక్కెర మిల్లులు,డిస్టిలరీలు చెరకు రసం,చక్కెర సిరప్,బి-హెవీ మొలాసిస్,సి-హెవీ మొలాసిస్ నుండి ఇథనాల్ను ఉత్పత్తి చేయడానికి అనుమతిని పొందాయి.
ఇంకా, ఇథనాల్ ఉత్పత్తి కోసం ఎఫ్సిఐ ద్వారా 23 లక్షల టన్నుల వరకు బియ్యాన్ని కొనుగోలు చేయడానికి డిస్టిలరీలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
దేశంలో ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇప్పటికే ఇథనాల్ను పెట్రోల్లో కలపడం జరుగుతుండగా, ఇప్పుడు డీజిల్లో కూడా ఇథనాల్ కలపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇథనాల్ ఉత్పత్తి విధానంలో ఈ మార్పు వల్ల చక్కెర నిల్వల్లో ప్రాముఖ్యత గల పెరుగుదల కనిపిస్తోంది, షుగర్ స్టాక్స్ ప్రారంభ ట్రేడింగ్లో 10 శాతం పెరిగాయి.