Page Loader
APSRTC: 17 మంది సభ్యులతో ఏపీఎస్ఆర్టీసీ బోర్డు ఏర్పాటు.. ప్రభుత్వం నోటిఫికేషన్
17 మంది సభ్యులతో ఏపీఎస్ఆర్టీసీ బోర్డు ఏర్పాటు.. ప్రభుత్వం నోటిఫికేషన్

APSRTC: 17 మంది సభ్యులతో ఏపీఎస్ఆర్టీసీ బోర్డు ఏర్పాటు.. ప్రభుత్వం నోటిఫికేషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2025
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీఎస్ఆర్టీసీ బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేస్తూ అధికారిక ప్రకటన జారీ చేసింది. చైర్మన్‌గా కొనకళ్ల నారాయణతో పాటు ఆరుగురు నామినేటెడ్ సభ్యులు, 11 మంది అధికారులతో బోర్డును రూపొందించారు. ఈ బోర్డులో ఆర్టీసీ ఎండీతో పాటు ఆర్థిక, రవాణా, సాధారణ పరిపాలన శాఖలతో పాటు ఇతర శాఖలు, విభాగాల ఉన్నతాధికారులను సభ్యులుగా చేర్చారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించేలా అధికారులను నియమించారు. రెండేళ్ల పాటు ఆర్టీసీ కార్యకలాపాలను పర్యవేక్షించేలా ఈ బోర్డును ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏపీఎస్ఆర్టీసీకి 17 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు