Group-2 Results: నేడు గ్రూప్-2 ఫలితాల విడుదల.. 5 లక్షల మంది ఎదురు చూపులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి.
జనరల్ ర్యాంకింగ్ జాబితాను టీజీపీఎస్సీ అదే రోజు ప్రకటించనుంది.
2022లో 783 పోస్టుల భర్తీ కోసం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయగా, ఈ పోస్టులకు 5 లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
2023 ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.
Details
మాడల్ టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి
ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనంలో మాడల్ స్కూల్ టీచర్లకు ప్రాధాన్యం కల్పించాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ నేతలు కోరారు.
ముఖ్యంగా చీఫ్ ఎగ్జామినర్, సబ్జెక్టు ఎక్స్పర్ట్, సీఎస్డీవో విధుల్లో అన్యాయం జరగకూడదని కోరుతూ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణఆదిత్యకు వినతిపత్రం అందజేశారు.
ల్యాబ్ టెక్నీషియన్ పరీక్ష ఫలితాల విడుదల
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీ కోసం గతేడాది నవంబర్ 11న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం ఈ ఫలితాలను ప్రకటించింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఫైనల్ కీ ఆధారంగా వెల్లడించారు.