Page Loader
Gujarat: గుజరాత్‌లో కూలిన గంభీర వంతెన.. నదిలో పడిపోయిన నాలుగు వాహనాలు 
గుజరాత్‌లో కూలిన గంభీర వంతెన.. నదిలో పడిపోయిన నాలుగు వాహనాలు

Gujarat: గుజరాత్‌లో కూలిన గంభీర వంతెన.. నదిలో పడిపోయిన నాలుగు వాహనాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్ రాష్ట్రంలో దుర్ఘటన చోటుచేసుకుంది. వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర్ వంతెన బుధవారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో వంతెనపై ప్రయాణిస్తున్ననాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. అధికారుల సమాచారం ప్రకారం ఈ ప్రమాదం ఉదయం 7:30 గంటల సమయంలో జరిగింది. బ్రిడ్జి కూలిన వెంటనే రెండు ట్రక్కులు,రెండు వ్యాన్లు నదిలోకి కిందపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకొని తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు 10మందిని రక్షించినట్లు తెలిపారు. ఇంకా చిక్కుకుపోయినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా,ఈవంతెన సుమారు 45ఏళ్ల క్రితమే నిర్మించబడిందని అధికారులు వెల్లడించారు.చాలా కాలంగా ఇది శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గుజరాత్‌లో కూలిన గంభీర వంతెన