Ambati Rambabu: పీటీ వారెంట్పై గుంటూరుకు అంబటి రాంబాబు… 14 రోజుల రిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసులో గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే అరెస్టైన ఆయన, ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, గతంలో వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఆందోళన సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై పట్టాభిపురం పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు.
వివరాలు
14 రోజుల రిమాండ్
ఈ కేసుకు సంబంధించి జైలులో ఉన్న అంబటి రాంబాబును పోలీసులు పీటీ వారెంట్పై రాజమహేంద్రవరం నుంచి గుంటూరుకు తీసుకొచ్చి, గుంటూరు స్పెషల్ జ్యుడీషియల్ కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇదే సమయంలో పోలీసుల కస్టడీ పిటిషన్తో పాటు అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై కూడా కోర్టులో విచారణ జరగనుంది. విచారణ అనంతరం ఆయనను తిరిగి రాజమహేంద్రవరం జైలుకు తరలించనున్నారు.