NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: చివరిదశకు గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్‌ పనులు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: చివరిదశకు గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్‌ పనులు
    చివరిదశకు గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్‌ పనులు

    Andhra Pradesh: చివరిదశకు గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్‌ పనులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 05, 2025
    09:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైలుమార్గ (డబ్లింగ్) పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి.

    మొత్తం 401 కిలోమీటర్ల మార్గాన్ని డబుల్ ట్రాక్, విద్యుదీకరణ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం రూ.3,631 కోట్ల వ్యయాన్ని మంజూరు చేసింది.

    ఈ మొత్తం వ్యయాన్ని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరించాలనే ఒప్పందం కుదిరింది.

    ఇప్పటి వరకు 347 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి, ఇప్పటికే పూర్తియైన భాగాల్లో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

    Details

    బెంగళూర్, గోవా  నుంచి రాయలసీమకు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ

    ఈ మార్గం పూర్తయిన తర్వాత బెంగళూరు, గోవా వంటి నగరాల నుంచి రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది.

    రైళ్ల సమయాల్లో సుమారు 1.30 గంటల సమయాన్ని ఆదా చేయడం సాధ్యమవుతుంది. ఈ మార్గం తూర్పు-పశ్చిమ భారతదేశం మధ్య వాణిజ్య, ప్రయాణ సంబంధాలను మెరుగుపరచనుంది.

    కొత్త రైళ్లను ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

    గోవా ఓడ రేవు నుంచి మచిలీపట్నం వరకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025