NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు
    తదుపరి వార్తా కథనం
    గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు
    యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం

    గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 23, 2023
    06:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కాబోయే ఇంజినీర్లు ఘర్షణ పడ్డారు. ఇంజినీరింగ్ విద్యకు ప్రసిద్ధి గాంచిన వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) యూనివర్సిటీలో ఒకరినొకరు దూషించుకుంటూ విద్యార్థులు గొడవ పడ్డారు.

    ఏకంగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే సీనియర్‌లు, జూనియర్‌లు అంటూ విడిపోయి భీకరంగా పోట్లాడుకున్నారు. చదువుకునే పిల్లలు ఇలా ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకోవడం జిల్లాలో కలకలం సృష్టించింది.

    ఈ ఘర్షణను ఆపేందుకు సెక్యూరిటీ సిబ్బంది, మరికొందరు విద్యార్థులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.

    హాస్టల్ గదుల కేటాయింపుపై సీనియర్లు, జూనియర్ల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు తన్నుకునే వరకు వచ్చినట్టు తెలుస్తోంది.

    DETAILS

    విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు

    గుంటూరులోని ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.

    ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు పొక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

    ప్రస్తుతం విద్యార్థుల బాహా బాహీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఘర్షణకు దిగిన విద్యార్థులను పిలిపించి అసలు ఏం జరిగిందో ఆరా తీశారు. దీనిపై విచారించి విద్యార్థులకు కౌన్సెలింగ్ చేసినట్లు సమాచారం.

    విద్యార్థుల భవిష్యత్ దృష్ణ్యా పోలీసులు కేసు నమోదు చేయలేదని వర్సిటీ అధికారులు అంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని, విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చి పంపించారని తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుంటూరు జిల్లా
    ఆంధ్రప్రదేశ్
    విద్యార్థులు

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    గుంటూరు జిల్లా

    గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం ఆంధ్రప్రదేశ్
    గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు  రోడ్డు ప్రమాదం

    ఆంధ్రప్రదేశ్

    వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్ సీబీఐ
    తిరుపతి హథీరాంజీ మఠంలో అర్జున్ దాస్ తొలగింపు, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం ప్రభుత్వం
    ప్రభుత్వంతో పట్టుబట్టి 37 డిమాండ్లు ఒడిసిపట్టాం.. ఉద్యమం విరమిస్తున్నాం  ఉద్యోగులు
    శభాష్.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు సీఎం వైఎస్ జగన్ అభినందనలు  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    విద్యార్థులు

    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యా శాఖ మంత్రి
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం ఇరాన్
    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025