NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Handloom loan waiver: రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
    తదుపరి వార్తా కథనం
    Handloom loan waiver: రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
    రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకం

    Handloom loan waiver: రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 10, 2024
    11:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధి కోసం రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

    రైతులకు అందించే రుణమాఫీ విధానాన్ని అనుసరించి, చేనేత కార్మికులకు కూడా రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఆ ప్రతిపాదన ఆమోదం పొందిన వెంటనే అమలు చేయవచ్చని చెప్పారు.

    అలాగే, అన్ని ప్రభుత్వ శాఖలు తమ అవసరాలకు అవసరమైన చేనేత వస్త్రాలను టెస్కో ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.

    ప్రైవేటు సంస్థల వద్ద కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    సోమవారం హైదరాబాద్ అమీర్‌పేటలో చేనేత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

    వివరాలు 

    రూ.1.09 కోట్లు పావలావడ్డీ విడుదల

    తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ''చేనేత కార్మికుల నిరంతర ఉపాధి కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది'' అని చెప్పారు.

    గత ప్రభుత్వం చేనేత, జౌళి శాఖకు సంబంధించిన బకాయిలను చెల్లించకపోవడంతో ఇప్పుడు ఈ బకాయిల భారం తమ ప్రభుత్వంపై పడిందన్నారు.

    కార్మికుల సంక్షేమం కోసం వివిధ పథకాల కింద రూ.428 కోట్లు బతుకమ్మ చీరల, రూ.290.09 కోట్లు నేతన్నకు చేయూత పథకం, రూ.5.45 కోట్లు మరమగ్గాల పథకం, రూ.37.49 కోట్లు 10 శాతం నూలు సబ్సిడీ, రూ.1.09 కోట్లు పావలావడ్డీ విడుదల చేశామన్నారు.

    ప్రతి ఏడాది 64.70 లక్షల మంది స్వయంసహాయక సంఘాల మహిళలకు రెండు చొప్పున ఏకరూప చీరల పంపిణీ పథకాన్ని కూడా చేపడతామన్నారు.

    వివరాలు 

    ప్రత్యేక వస్త్రప్రదర్శనలో 40% రాయితీపై రూ.1 కోటి విలువైన వస్త్రాల విక్రయం 

    జాతీయ చేనేత సాంకేతిక సంస్థ (ఐఐహెచ్‌టీ)కి శాశ్వత క్యాంపస్ నిర్మాణం త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

    ప్రజాపాలన విజయోత్సవాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వస్త్రప్రదర్శనలో 40% రాయితీపై రూ.1 కోటి విలువైన వస్త్రాలను విక్రయించారని, ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ తెలిపారు.

    కార్యక్రమంలో గజం అంజయ్య, గజం గోవర్ధన్, చింతకింది మల్లేశం, ధనలక్ష్మి, వైకుంఠం, ఖలీల్, దర్జన్, సలీం, సులోచన, విమల, ప్రణయ్, అన్వర్, ఇంద్రజీత్ వంటి చేనేత, హస్త కళాకారులను సత్కరించారు.

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ నాయుడు సత్యనారాయణ, టెస్కో మాజీ ఛైర్మన్లు మండల శ్రీరాములు, గడ్డం జగన్నాథం, పద్మశాలి సంఘం నేత మురళి తదితరులు పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తుమ్మల నాగేశ్వరరావు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తుమ్మల నాగేశ్వరరావు

    Runa Mafi: రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. రేపటి నుండి కొత్త యాప్ ద్వారా వారి వివరాలు సేకరణ ప్రభుత్వం
    Tummala Nageswar Rao: మలేషియాలో మాదిరి తెలంగాణలోనూ పామాయిల్‌ విత్తన కేంద్రం: మంత్రి తుమ్మల భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025