NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kumbh Mela: హర హర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతున్న కుంభమేళా ఘాట్లు! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kumbh Mela: హర హర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతున్న కుంభమేళా ఘాట్లు! 
    హర హర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతున్న కుంభమేళా ఘాట్లు!

    Kumbh Mela: హర హర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతున్న కుంభమేళా ఘాట్లు! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 26, 2025
    09:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా ప్రారంభమైన మహాకుంభమేళా భక్తులతో కిటకిటలాడుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవం నేటితో ముగియనుంది.

    ఈ సందర్భంగా బుధవారం మహాశివరాత్రి పర్వదినం కావడంతో త్రివేణీ సంగమ ఘాట్లు భక్తుల నామస్మరణలతో మార్మోగుతున్నాయి.

    'హర హర మహాదేవ్‌' నినాదాలతో కుంభమేళా ప్రాంగణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది.

    64 కోట్ల మంది భక్తుల హాజరు

    ఇప్పటి వరకు 64 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాకు విచ్చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మహోత్సవంలో నేడు చివరి అమృత్‌ స్నానం జరగనుండటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు భద్రతా చర్యలను మరింత పెంచారు.

    Details

    భక్తులు భద్రతా నియమాలు పాటించాలి

    ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.

    భక్తులు భద్రతా నియమాలు పాటించి, అధికారులతో సహకరించాలని ప్రత్యేక సూచనలు జారీ చేశారు.

    ఈ ఏర్పాట్లను గోరఖ్‌నాథ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

    కుంభమేళాలో నో వెహికల్ జోన్

    కొన్నిరోజుల క్రితం మౌని అమావాస్య, వసంత పంచమి వంటి ముఖ్యమైన పర్వదినాల్లో భక్తులు పెద్దఎత్తున తరలి రావడంతో ప్రయాగ్‌రాజ్‌ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు 350 కి.మీ. వరకు వాహనాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

    కుంభమేళా ప్రాంగణాన్ని 'నో వెహికల్ జోన్'గా ప్రకటించి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి అమలు చేశారు. నిత్యావసర సరుకులు తీసుకొచ్చే వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

    Details

     భక్తుల రవాణా కోసం ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లు 

    కుంభమేళా ముగిసిన అనంతరం భక్తులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేలా రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

    ఈ క్రమంలో బుధవారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రయాగ్‌రాజ్ నుంచి 350 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

    ఈ విధంగా మహాకుంభమేళా విజయవంతంగా ముగియనుండగా, భక్తుల భద్రత, సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు సమర్థంగా చర్యలు తీసుకుంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యోగి ఆదిత్యనాథ్
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    యోగి ఆదిత్యనాథ్

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఉత్తర్‌ప్రదేశ్
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ అఖిలేష్ యాదవ్
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ ఉత్తర్‌ప్రదేశ్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్

    ఉత్తర్‌ప్రదేశ్

    Prayagraj: 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. వక్ఫ్ భూమిపై కొనసాగుతున్న వివాదం ఇండియా
    Maha Kumbh mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. భక్తుల తాకిడితో కిటకిటలాడిన త్రివేణి సంగమం యోగి ఆదిత్యనాథ్
    Maha Kumbh : మహా కుంభమేళా కోసం 13వేల ప్రత్యేక రైళ్లు  భారతదేశం
    Maha Kumbh Mela : కుంభ మేళాకు వెళ్తున్నారా? తెలుగు వారి కోసం  పార్కింగ్ ప్రదేశాలు, రూట్ వివరాలు!  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025