NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Money Laundering Case: మనీలాండరింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Money Laundering Case: మనీలాండరింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..
    మనీలాండరింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..

    Money Laundering Case: మనీలాండరింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 05, 2025
    11:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ధర్మ సింగ్ చోకర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది.

    దీన్ దయాళ్ ఆవాస్ యోజన పథకం కింద దాదాపు రూ. 1,500 కోట్లను అక్రమంగా తరలించారని ఆరోపణలు ఉన్నాయి.

    ఈ కేసులో, సికందర్ సింగ్, అతని తండ్రి కలిసి 1,500 మందికి పైగా గృహ కొనుగోలుదారులను మోసం చేసి, ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో నకిలీ నిర్మాణ ఖర్చులను చూపించి రూ. 400 కోట్లను దోచుకున్నట్లు ఈడీ గుర్తించింది.

    గత ఏడాది మార్చి నెలలో సికందర్‌ను అరెస్ట్ చేయగా, ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.

    వివరాలు 

    చికిత్స పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు

    మార్చి 2024లో, సికందర్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కానీ, అతను పంజాబ్-హర్యానా హైకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన తర్వాత, జైలు శిక్షను తప్పించడానికి అనారోగ్యంతో ఉన్నట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

    దీంతో అతడికి చికిత్స పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది.

    కానీ, రోహ్‌తక్‌లోని ఆసుపత్రి వెలుపల స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాడు.

    ఈ విషయాన్ని పోలీసులు కోర్టుకు సమర్పించారు, తద్వారా అతడిని తిరిగి అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    వివరాలు 

    గృహ కొనుగోలుదారుల నుంచి సుమారు రూ. 363 కోట్లు వసూలు

    గురుగ్రామ్ పోలీసులు,కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ధర్మ సింగ్ చోకర్‌కు చెందిన మిహిరా గ్రూప్ ద్వారా పెద్ద ఎత్తున మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ FIR నమోదు చేసిన తర్వాత,2023లో ఈడీ దర్యాప్తును తన ఆధీనంలోకి తీసుకుంది.

    గురుగ్రామ్ సెక్టార్ 68లో గృహ కొనుగోలుదారుల నుంచి సుమారు రూ. 363 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ విచారణలో గుర్తించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా

    తాజా

    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్
    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి

    హర్యానా

    Haryana: గోసంరక్షకుల దాడిలో 12వ తరగతి విద్యార్థి హత్య  ఇండియా
    Haryana Election: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రెండో జాబితా విడుదల ఇండియా
    Haryana polls: వృద్ధులు, వితంతువులు,వికలాంగులకు రూ.6వేల పెన్షన్.. ఏడు గ్యారంటీలతో హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో  కాంగ్రెస్
    NRI quota system: 'ఆ ఎన్‌ఆర్‌ఐ కోటా మోసం' ఎంబీబీఎస్‌ ప్రవేశ నిబంధనపై సుప్రీం కోర్టు  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025