
Nagarjuna Sagar: నాగార్జునసాగర్కు భారీ వరద ప్రవాహం.. 26 గేట్లు ఎత్తివేత!
ఈ వార్తాకథనం ఏంటి
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి ముంచెత్తుతున్న వరదతో సాగర్ నిండుకుండగా మారింది. నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరువ కావడంతో అధికారులు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం 26 గేట్లను ఎత్తగా, అందులో 24 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర, మరో 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, దిగువకు 2,09,632 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Details
ప్రస్తుతం 585.10 అడుగులుగా నమోదు
ప్రాజెక్టులోకి ప్రస్తుతం 2,54,519 క్యూసెక్కుల వరద నీరు వచ్చేస్తుండగా, అంతే పరిమాణంలో ఔట్ఫ్లో కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం ఇది 585.10 అడుగులుగా నమోదైంది. అలాగే, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 296.7235 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుకు చేరిన నీటితో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతోంది.