LOADING...
Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.. నాలుగు గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.. నాలుగు గేట్లు ఎత్తివేత

Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.. నాలుగు గేట్లు ఎత్తివేత

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 12, 2025
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఫలితంగా జలాశయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో పాటు, జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయికి చేరుకోవడంతో ఈ సీజన్‌లో మూడోసారి గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోకి 2,02,456 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇందులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,808 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Details

ప్రస్తుతం 882.70 అడుగుల మేర నీరు

అదనంగా నాలుగు స్పిల్ వే గేట్లు ఎత్తి 1,08,076 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 882.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 202.96 టీఎంసీలుగా ఉంది.