NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్
    తదుపరి వార్తా కథనం
    ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్
    ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్

    ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్

    వ్రాసిన వారు Stalin
    Jul 11, 2023
    10:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.

    గత రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఇతర కారణాల వల్ల ఇప్పటి వరకు 37 మంది మరణించారు.

    హిమాచల్ ప్రదేశ్‌లో గత రెండు రోజులుగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 18మంది ప్రాణాలు కోల్పోయారు.

    పంజాబ్, హర్యానాలో తొమ్మిది మంది, రాజస్థాన్‌లో ఏడుగురు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ముగ్గురు భారీ వర్షాల వల్ల తలెత్తిన ప్రమాదాల వల్ల చనిపోయారు.

    దిల్లీలోని యమునా సహా పలు నదులు ఉప్పొంగుతున్నాయి. అలాగే ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు నగరాలు, పట్టణాల్లో పలు రహదారులు, నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి.

    ఉత్తర భారతం

    39 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు

    భారీ వర్షాలు, వరదలను పరిష్కరించడానికి మొత్తం 39 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్) బృందాలను తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మోహరించారు.

    పంజాబ్‌లో 14 బృందాలు పనిచేస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లో 12, ఉత్తరాఖండ్‌లో ఎనిమిది, హర్యానాలో ఐదు బృందాలు పనిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే, వర్షాల కారణంగా జమ్ముకశ్మీర్‌లో 7,000 మందికి పైగా యాత్రికులు చిక్కుకుపోయారు.

    భగవతినగర్ బేస్ క్యాంపులో 5,000 మందికి పైగా, రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్ బేస్ క్యాంపులో మరికొంత మంది చిక్కుకున్నారు.

    జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసిన నేపథ్యంలో మంగళవారం అమర్‌నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    హిమాచల్‌లో వరద బీభత్సం

    #WATCH | Furiously flowing Beas river engulfs a truck in Kullu of Himachal Pradesh

    (Video shot by a local and confirmed by police) pic.twitter.com/jkT6B8yzB9

    — ANI (@ANI) July 10, 2023

    హిమాచల్

    హిమాచల్ ప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ జారీ

    వర్షాల తీవ్రత హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. లాహౌల్, స్పితిలోని చందర్తాల్, పాగల్ నల్లాతో పాటు ఇతర ప్రదేశాలలో 300 మందికి పైగా పర్యాటకులు మరియు స్థానికులు చిక్కుకుపోయారు.

    అయితే వాతావరణం కుదుటపడ్డాక వారిని ప్రత్యేక విమానంలో తరలిస్తామని ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు చెప్పారు. భారీ వరదల కారణంగా రాష్ట్రంలోని అనే చోట్ల విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది.

    రాష్ట్రంలో దాదాపు 800 రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని 12 జిల్లాలకు గాను ఎనిమిది జిల్లాల్లో మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

    దిల్లీ

    దిల్లీలో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా

    భారీ వర్షాల కారణంగా దిల్లీలోని యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

    దిల్లీలోని భారీ వర్షాలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. యమునా నదిలో వరద పెరుగుదలపై చర్చించారు. దేశ రాజధానిలో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

    వరదల్లో చిక్కుకోవడంతో పంజాబ్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన 910 మంది విద్యార్థులతో పాటు మరో 50 మందిని ఆర్మీ రక్షించింది.

    వర్షాల కారణంగా పంజాబ్ ప్రభుత్వం జూలై 13 వరకు రాష్ట్రంలోని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది.

    దిల్లీ

    అప్రమత్తంగా ఉండండి: అధికారులకు యూపీ సీఎం ఆదేశం

    ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివిధ శాఖల సీనియర్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించారు.

    ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారితో పాటు పలు రహదారులు మూసుకుపోయాయని అధికారులు తెలిపారు.

    ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని యూపీ సీఎం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

    రాజస్థాన్‌లో వర్షాల కారణంగా తూర్పు, మధ్య ప్రాంతాలలో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు, రైలు పట్టాలు, ఆసుపత్రులను కూడా వరదలు ముంచెత్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వర్షాకాలం
    ఉత్తరాఖండ్
    హిమాచల్ ప్రదేశ్
    పంజాబ్

    తాజా

    Tamil Nadu: విద్య నిధులను నిలిపివేసినందుకు.. కేంద్రంపై మరోసారి సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం.. తమిళనాడు
    Banu Mushtaq: 'హార్ట్‌ల్యాంప్‌' కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌'కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ కర్ణాటక
    USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య..  అమెరికా
    Mohanlal: మోహన్‌లాల్‌ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు సినిమా

    వర్షాకాలం

    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం నైరుతి రుతుపవనాలు
    కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు; ధృవీకరించిన ఐఎండీ  నైరుతి రుతుపవనాలు
    తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం నైరుతి రుతుపవనాలు
    పులిపిర్లు తొలగించడానికి, తేలు విషాన్ని తగ్గించడానికి, దంతాలకు బలం చేకూర్చడానికి పనికొచ్చే పులిచింత మొక్క ప్రయోజనాలు  లైఫ్-స్టైల్

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి జోషిమఠ్

    హిమాచల్ ప్రదేశ్

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు ప్రయాణం
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ భారతదేశం

    పంజాబ్

    అమృతపాల్ సింగ్‌ అరెస్టుకు ఆపరేషన్ షురూ: ఇంటర్నెట్ బంద్; పంజాబ్‌లో ఉద్రిక్తత ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన అతని మామ, డ్రైవర్ అమృత్‌సర్
    'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు ఖలిస్థానీ
    అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు ఖలిస్థానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025