Jammu: జమ్ముకశ్మీర్లో భారీగా విరిగిన మంచుచరియలు
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా జమ్ముకశ్మీర్లో మళ్లీ మంచు కురుస్తుండటంతో గండేర్బల్ జిల్లాలో భారీ మంచు చరియలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరికి ప్రాణనష్టం కాలేదని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు,దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. మంగళవారం రాత్రి సోనామార్గ్లో ఈ ఘోరమైన మంచు చరియలు విరిగినట్లు తెలిసింది. పలు ఇళ్లు, రిసార్ట్లు, వాహనాలను మంచు కప్పేసింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రెస్క్యూ బృందాలు,స్థానిక అధికారులు వెంటనే అక్కడికి చేరి సహాయక చర్యలు ప్రారంభించారు. అధికారులు స్పష్టంగా చెప్పారు - ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదుకాలేదు.
వివరాలు
పలు విమానాలను రద్దు
కశ్మీర్ అంతటా మంగళవారం భారీ మంచు కురిసిన కారణంగా, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. శ్రీనగర్ విమానాశ్రయంలో పలు విమానాలను రద్దు చేశారు,దీంతో అనేక పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. ఇక కిశ్త్వార్ జిల్లాలో కూడా మంచు చరియలు విరిగిన ఫలితంగా పలు మేకలు, గొర్రెలు మృతి చెందాయి. హస్తీ వంతెన దగ్గర గొర్రెల కాపర్లు తమ పశువులతో ఆ ప్రాంతం దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.