భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఈడీ సమన్లు
భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సుమారు 1000 కోట్ల రూపాయల భూ కుంభకోణంలో సీఎం సోరెన్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఆగస్టు 14న ఈ వ్యవహారంలో విచారణకు రావాల్సిందిగా సమన్లలో ఈడీ పేర్కొంది. అంతకుముందు, ఈ విషయంలో 18 నవంబర్ 2022న సోరెన్ను ఈడీ విచారించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశారు. ఇందులో రాంచీ మాజీ డిప్యూటీ కమిషనర్ ఛవీ రంజన్, కోల్కతాకు చెందిన వ్యాపారవేత్త అమిత్ అగర్వాల్, వ్యాపారవేత్త బిష్ణు అగర్వాల్ పేర్లు ఉన్నాయి.