భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఈడీ సమన్లు
ఈ వార్తాకథనం ఏంటి
భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
సుమారు 1000 కోట్ల రూపాయల భూ కుంభకోణంలో సీఎం సోరెన్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసులో సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది.
ఆగస్టు 14న ఈ వ్యవహారంలో విచారణకు రావాల్సిందిగా సమన్లలో ఈడీ పేర్కొంది.
అంతకుముందు, ఈ విషయంలో 18 నవంబర్ 2022న సోరెన్ను ఈడీ విచారించింది.
ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశారు. ఇందులో రాంచీ మాజీ డిప్యూటీ కమిషనర్ ఛవీ రంజన్, కోల్కతాకు చెందిన వ్యాపారవేత్త అమిత్ అగర్వాల్, వ్యాపారవేత్త బిష్ణు అగర్వాల్ పేర్లు ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఈ నెల 14న సోరెన్ను ప్రశ్నించనున్న ఈడీ
#BREAKING
— TIMES NOW (@TimesNow) August 8, 2023
ED summons Jharkhand CM Hemant Soren in an alleged money laundering case.
Listen in for more details as @bhavatoshsingh pic.twitter.com/5iF8ohauzZ