Page Loader
IND-PAK Tension: ఆపరేషన్ సిందూర్, సరిహద్దు పరిస్థితులపై మోదీతో హైలెవల్ మీటింగ్
ఆపరేషన్ సిందూర్, సరిహద్దు పరిస్థితులపై మోదీతో హైలెవల్ మీటింగ్

IND-PAK Tension: ఆపరేషన్ సిందూర్, సరిహద్దు పరిస్థితులపై మోదీతో హైలెవల్ మీటింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2025
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, దేశ రాజధానిలో హైఅలర్ట్ కొనసాగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం కొనసాగుతోంది. ఈ సమీక్షా సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనీల్ చౌహాన్‌తో పాటు త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 'ఆపరేషన్‌ సిందూర్' పురోగతిపై సమగ్ర సమీక్ష కొనసాగుతోంది. సరిహద్దు పరిస్థితులు, పాకిస్తాన్ డ్రోన్ల దాడుల ఉధృతిపై చర్చ జరుగుతోంది. తాజా భద్రతా వివరాలను ప్రధానికి అధికారులెందరైనా సమర్పించగా, మిగిలిన దశల వ్యూహంపై ప్రధానమంత్రి కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

Details

ప్రజలను అప్రమత్తం చేసిన సైరన్లు

మరోవైపు పాకిస్తాన్ భారత్‌పై దాడులు కొనసాగిస్తోంది. శనివారం జైసల్మేర్, ఫూంఛ్‌, శ్రీనగర్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయని భారత ఆర్మీ వెల్లడించింది. శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో గట్టిగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అధికారులు పేర్కొన్నారు. పేలుళ్లతో ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే భద్రతా బలగాలు సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అన్ని మిలిటరీ విభాగాలు సమన్వయంతో కదులుతున్నాయని సమాచారం.