NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నివాసంలో హై లెవల్ భద్రతా సమీక్ష
    తదుపరి వార్తా కథనం
    PM Modi: సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నివాసంలో హై లెవల్ భద్రతా సమీక్ష
    సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నివాసంలో హై లెవల్ భద్రతా సమీక్ష

    PM Modi: సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నివాసంలో హై లెవల్ భద్రతా సమీక్ష

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 11, 2025
    11:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆపరేషన్ సిందూర్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం ప్రారంభమైంది.

    ఈ కీలక భేటీలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.

    ఇటీవల భారత్‌-పాక్‌ మధ్య పరస్పర చర్చల అనంతరం కాల్పుల విరమణను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్‌ కొద్దిసేపటికే ఉల్లంఘించింది.

    ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ అత్యున్నత భద్రతా సమీక్ష సమావేశం జరుగుతోంది.

    Details

    మరికొద్దిసేపట్లో అధికారిక ప్రకటన

    ఈ సమావేశంలో ప్రధానంగా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశముంది.

    అలాగే కాల్పుల విరమణపై పాకిస్థాన్‌ వైఖరి, భారత్‌ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా విశ్లేషణ జరగనుంది.

    తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు సంయుక్తంగా ప్రెస్‌ బ్రీఫింగ్‌కు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

    మరికొద్దిసేపట్లో ఈ అంశాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    PM Modi: సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నివాసంలో హై లెవల్ భద్రతా సమీక్ష నరేంద్ర మోదీ
    Tata Curvv: కేవలం రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో టాటా కర్వ్ మీ ఇంటికే! టాటా
    Pawan Kalyan: వీరజవాను మురళీనాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షల సాయం : పవన్‌ కళ్యాణ్ పవన్ కళ్యాణ్
    Donald Trump: కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వానికి సిద్ధం.. ట్రంప్‌ కీలక ప్రకటన డొనాల్డ్ ట్రంప్

    నరేంద్ర మోదీ

    PM Modi: పరిపాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం కాదు: ప్రధాని మోదీ భారతదేశం
    PM Modi- JD Vance: ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక సమావేశం  అమెరికా
    PM Modi- JD Vance: ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, వాన్స్‌ సమీక్ష.. సాంకేతికత,రక్షణపై దృష్టి  భారతదేశం
    PM Modi: సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లిన మోదీ.. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు హాజరు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025