NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 100 పైగా రోడ్లు మూసివేత, 8 జిల్లాలకు హెచ్చరికలు 
    తదుపరి వార్తా కథనం
    Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 100 పైగా రోడ్లు మూసివేత, 8 జిల్లాలకు హెచ్చరికలు 
    హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 100 పైగా రోడ్లు మూసివేత, 8 జిల్లాలకు హెచ్చరికలు

    Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 100 పైగా రోడ్లు మూసివేత, 8 జిల్లాలకు హెచ్చరికలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 02, 2024
    05:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హిమాచల్‌ ప్రదేశ్‌లో వరుస వర్షాలు రాష్ట్రంలో సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి.

    వర్షాల కారణంగా జాతీయ రహదారి 707 సహా మొత్తం 109 రహదారులు మూసివేసినట్లు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్‌ కేంద్రం (SEOC) సోమవారం ప్రకటించింది.

    చంబా, కాంగ్రా, మండి, సిమ్లా, సిర్మౌర్, సోలన్, కులు, కిన్నౌర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం వరకు తక్కువ నుండి మోస్తరు వరకు ఆకస్మిక వరదల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

    రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

    Details

    జాతీయ రహదారి బ్లాక్ తో ప్రయాణికుల ఇబ్బందులు

    సిమ్లా జిల్లాలోని హత్‌కోటి, సిర్మౌర్ జిల్లాలోని పోంటా సాహిబ్ మధ్య జాతీయ రహదారి 707 బ్లాక్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

    సిర్మౌర్‌లో 55 రహదారులు, సిమ్లాలో 23, మండి, కాంగ్రాలో ఒక్కోటి 10, కులులో 9, లాహౌల్, స్పితి, ఉనా జిల్లాల్లో ఒక్కొక్క రహదారిని మూసివేశారు.

    ఆదివారం సాయంత్రం నుండి గడిచిన 24 గంటల్లో, సిర్మౌర్, బిలాస్‌పూర్, మండి జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి.

    Details

    ఈ ఏడాది 151 మంది మృతి

    సిర్మౌర్ జిల్లాలోని నహాన్‌లో 143.5 మిమీ వర్షపాతం, నైనా దేవిలో 130 మిమీ వర్షపాతం కురిసింది.

    జూన్ 27న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్‌లో సాధారణ వర్షపాతం కంటే 23 శాతం తక్కువగా నమోదైంది.

    వర్షాల వల్ల ఈ ఏడాది 151 మంది మరణించగా, రాష్ట్రానికి రూ.1,265 కోట్ల మేర నష్టం కలిగిందని అధికారులు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హిమాచల్ ప్రదేశ్
    ఇండియా

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    హిమాచల్ ప్రదేశ్

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు ప్రయాణం
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ భారతదేశం

    ఇండియా

    Heart attack: దంతాలు కోల్పోయిన వ్యక్తులకు గుండెపోటు  దంతాలు
    Ayodhya: అయోధ్య రామమందిర మార్గంలో భారీ చోరీ అయోధ్య
    Bangalore: టెక్కీ అదృశ్యం.. సోషల్ మీడియాను అశ్రయించిన భార్య  బెంగళూరు
    Independence Day: క్రీడా చరిత్రలో భారతదేశం సాధించిన టాప్ 5 విజయాలివే!  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025