LOADING...
Narendra Modi: చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. ప్రపంచ నేతల నుంచి అభినందనల వెల్లువ
చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. ప్రపంచ నేతల నుంచి అభినందనల వెల్లువ

Narendra Modi: చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. ప్రపంచ నేతల నుంచి అభినందనల వెల్లువ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న అత్యధికకాలం వరుసగా ఎన్నికై ప్రధానిగా కొనసాగిన రికార్డును ఆయన అధిగమించారు. 2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన మోదీ,వరుసగా మూడు సార్లు ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చి మంగళవారం నాటికి 4,399రోజుల నిరంతర పదవీకాలాన్ని పూర్తి చేశారు. దీంతో 4,398రోజుల పాటు కొనసాగిన నెహ్రూ రికార్డు చరిత్రలోకి వెళ్లింది. ఈ చారిత్రక ఘట్టంపై ప్రపంచ దేశాల నాయకులు ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే స్పందిస్తూ..భారత ప్రజలు మోదీ నాయకత్వంపై ఉంచిన అపార విశ్వాసానికి ఈ ఘనత నిదర్శనమని పేర్కొన్నారు.

వివరాలు 

కేంద్ర ప్రభుత్వం ప్రధాన విజయాలు

పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మారాపే మోదీని స్ఫూర్తిదాయక నాయకుడిగా కొనియాడుతూ, పేదరిక నిర్మూలనతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాత్రను ప్రశంసించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా పర్సాద్-బిస్సేసర్ కూడా మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై కీలక శక్తిగా ఎదిగిందని అభినందించారు. గత 12 సంవత్సరాలుగా మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం, డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం కావడం, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠ పెరగడం వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం ప్రధాన విజయాలుగా పేర్కొంటోంది.

వివరాలు 

దేశాభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు

మరోవైపు, ఈ పాలనపై ప్రతిపక్ష పార్టీలు తమ విమర్శలను కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే, వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా మోదీ సాధించిన ఈ మైలురాయి భారత ప్రజాస్వామ్య చరిత్రలో ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ప్రస్తుతం మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్న ఆయన, రాబోయే రోజుల్లో దేశాభివృద్ధి కోసం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.

Advertisement