తదుపరి వార్తా కథనం

Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం.. నీటిమట్టం 876 అడుగులకు చేరింది!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 05, 2025
09:27 am
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 1,20,419 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇదే సమయంలో జలాశయం నుంచి ఔట్ఫ్లో 67,009 క్యూసెక్కులుగా నమోదైంది. ఈ విడుదలలో భాగంగా, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31,704 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుతూ నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 876.90 అడుగులకు చేరుకుంది. అలాగే, జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 172.66 టీఎంసీల నీటి నిల్వ ఉంది.