
తెలంగాణలో వచ్చే 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. సగటు వర్షపాతాన్ని దాటేసినట్లు ఐఎండీ వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. ఈ కారణంగానే పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి.
ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వానలు పడనున్నట్లు వాతావరణ విభాగం సూచించింది.ఖమ్మం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనుంది.
జూన్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 603.2 మి.మీగా పేర్కొన్న వాతావరణ కేంద్రం, 723.1 మి.మీ వర్షపాతం కురిసినట్లు ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇప్పటికే ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
Latest update
— ANSHULGAUTAM (@ANSHUL__GAUTAM) September 5, 2023
Heavy rain lashes Hyderabad city.
The IMD has issued an orange and yellow alert for the state. #HyderabadRain #IMDAlert #Hyderabad #India #Alert #Telangana pic.twitter.com/z7bVVYyfII