NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణలో 5 రోజులు దంచి కొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణలో 5 రోజులు దంచి కొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
    తెలంగాణలో 5 రోజులు దంచి కొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ

    తెలంగాణలో 5 రోజులు దంచి కొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 19, 2023
    12:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో మరో 5 రోజుల పాటు వానలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

    రెడ్ అలెర్ట్ జిల్లాలు :

    ఉమ్మడి ఖమ్మం, వరంగల్ ( మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం ) జిల్లాల్లో వర్షాలు బీభత్సంగా కురవనున్నట్లు స్పష్టం చేసింది.

    ఆరెంజ్ అలెర్ట్ జిల్లాలు :

    కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

    ఎల్లో అలెర్ట్ జిల్లాలు :

    ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాభాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్.

    details

    వచ్చే సోమవారం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు 

    బుధవారం నుంచి వచ్చే సోమవారం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

    మరోవైపు సోమవారం నుంచి రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీకి ప్రాణహిత వరద పోటెత్తుతోంది. ఈ మేరకు 35 గేట్లు ఎత్తి, 1,65,394 క్యూసెక్కుల నీరు కిందికి వదులుతున్నారు.

    తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ వద్ద గోదావరితో పాటు ఇంద్రావతి నదికి భారీగా వరద వస్తోంది. దీంతో 33 గేట్లు ఎత్తి, లక్షా 95 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

    భూపాలపల్లిలో ఓసీపీ గనుల్లో వర్షాలకు 8 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది.

    details

    ఎమర్జెన్సీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

    కుంభవృష్టిని దృష్టిలో ఉంచుకుని బొగత వాటర్ ఫాల్స్ వద్దకు టూరిస్టుల రాకను అటవీ శాఖ నిలిపేసింది. రాష్ట్రంలో భారీ నుంతి అతి భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

    రెడ్ అలెర్ట్ ప్రకటిత జిల్లాల్లో ప్రజలెవరూ బయటకు రావొద్దని ఆమె సూచించారు. ఈ మేరకు కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

    లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల వద్ద ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలన్నారు. అగ్నిమాపక శాఖతో పాటు విపత్తు నిర్వహణశాఖ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

    రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎమర్జెన్సీ తలెత్తితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైదరాబాద్
    నైరుతి రుతుపవనాలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలంగాణ

    30ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ  తెలుగు సినిమా
    మూడు కొత్త మండలాల ఏర్పాటుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్  ఆదిలాబాద్
    తెలంగాణ టీ డయాగ్నాస్టిక్ సెంటర్లలో 134ఉచిత పరీక్షలు: హరీష్ రావు  హైదరాబాద్
    నేడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ; కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం  ఖమ్మం

    హైదరాబాద్

    నేనేక్కడికి వెళ్లను.. బీజేపీలోనే ఉంటా : విజయశాంతి  తెలంగాణ
    తెలంగాణకి మోదీ రాక, ఈసారి అక్కడ ఓపెన్ రోడ్‌ షో నరేంద్ర మోదీ
    తెలంగాణ: చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడో చెప్పిన మంత్రి తలసాని తెలంగాణ
    దేశానికే హైదరాబాద్ హెల్త్ హబ్.. అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రికి భాగ్యనగరమే నిలయం తెలంగాణ

    నైరుతి రుతుపవనాలు

    ఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు  వర్షాకాలం
    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం వర్షాకాలం
    కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు; ధృవీకరించిన ఐఎండీ  వర్షాకాలం
    తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం వర్షాకాలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025