NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆకలి సూచిక : పాకిస్తాన్ కంటే దిగువ స్థానంలో భారత్.. సూచీ విధాన లోపమే కారణమంటున్న కేంద్రం 
    తదుపరి వార్తా కథనం
    ఆకలి సూచిక : పాకిస్తాన్ కంటే దిగువ స్థానంలో భారత్.. సూచీ విధాన లోపమే కారణమంటున్న కేంద్రం 
    సూచీ విధాన లోపమే కారణమంటున్న కేంద్రం

    ఆకలి సూచిక : పాకిస్తాన్ కంటే దిగువ స్థానంలో భారత్.. సూచీ విధాన లోపమే కారణమంటున్న కేంద్రం 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 13, 2023
    01:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ ఆహార సూచీ-2023లో భారత్‌ స్థానం పట్ల కేంద్రం ఆక్షేపిస్తోంది. ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం 111వ స్థానంలో నిలవడంపై ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది.

    మొత్తం 125 దేశాల్లో భారత్ 111 ర్యాంకులో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే సూచీలోనే లోపభూయిష్ట విధానాలున్నాయని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది.

    ఇది తప్పుడు ర్యాంకింగ్‌ సిస్టమ్ అని, దురుద్దేశపూర్వకంగానే ఇచ్చినట్లుగా ఉందని వ్యతిరేకించింది. సంక్షోభంలో నిండా మునిగిన పాకిస్థాన్ (102), శ్రీలంక (60), బంగ్లాదేశ్‌ (81), నేపాల్‌ (61) భారతదేశం కంటే చాలా మెరుగైన స్థానాల్లో నిలవడం పట్ల సంభ్రామాశ్చర్యాలను వ్యక్తమవుతోంది.

    ఆకలి విషయంలో 28.7 స్కోరుతో భారత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు ప్రపంచ నివేదిక బట్టబయలు చేసింది.

    details

    కేవలం 3,000 మందిపై నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ అంటూ కొట్టివేత

    ఇదంతా అభూత కల్పన అంటూ కేంద్రం మండిపడింది.ఇది తప్పుడు పద్ధతులతో రూపొందించిన సూచీ అని కొట్టిపారేసింది.

    కేవలం 3,000 మందిపై నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ మేరకు పౌష్టికాహార లోపం శాతాన్ని నిర్ధారించడాన్ని ఖండించింది.

    బాలల్లోని 7.2 శాతం పౌష్టికాహార లోపాన్ని 18.7గా చిత్రీకరించింది.ఈ సూచీ విడుదలలో దురుద్దేశాలు ఉన్నట్లు కేంద్రం కుండబద్దలు కొట్టింది.

    27 స్కోరుతో దక్షిణాసియా, సహారాకు దక్షిణాన ఆఫ్రికా ప్రాంతాలు ఆకలి సూచీలో కింద నుంచి టాప్ లో ఉన్నాయి.

    భారత బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉందని నివేదిక వెల్లడించింది. 5ఏళ్ల లోపు పిల్లల్లో మరణాల రేటు 3.1 శాతంగా, 15-24 ఏళ్ల లోపు మహిళల్లో రక్తహీనత బాధితుల సంఖ్య 58.1 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం
    ప్రపంచం
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    ఆహారం

    మీరు ఇష్టంగా తినే జిలేబీ, గులాబ్ జామూన్ భారతదేశానివి కావని మీకు తెలుసా? జీవనశైలి
    జాతీయ పోషకాహార వారోత్సవాలు: మిల్లెట్స్ పై ఫోకస్ తో ఫుడ్ ఫెయిర్ నిర్వహిస్తున్న గ్లాన్స్ జీవనశైలి
    Food: ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా ఎందుకు తినాలి? తినకపోతే ఏమవుతుంది?  జీవనశైలి
    శరీరంలోని విష పదార్థాలను తొలగించే ప్రత్యేక ఆహారాలు నిజంగా ఉన్నాయా? ఇది తెలుసుకోండి  ఆరోగ్యకరమైన ఆహారం

    ప్రపంచం

    కళ్లు చెదిరే ఫీచర్లతో లంబోర్ఘిని రేసు కారు ఆవిష్కరణ ఆటో మొబైల్
    కన్నడ మీడియాలోకి ఏఐ యాంకర్ సౌందర్య ఎంట్రీ! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    వినేశ్‌ ఫొగాట్‌కు NADA నోటీసులు! రెజ్లింగ్
    ఇక ట్విట్టర్‌లో డబ్బులు సంపాదించే అవకాశం.. ఎలాగంటే! ట్విట్టర్

    కేంద్ర ప్రభుత్వం

    No confidence Motion:లోక్ సభలో వీగిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభ
    రసాభసాగా పార్లమెంట్.. నేటితో ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అమిత్ షా
    భారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన  లోక్‌సభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025