
ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్బీ నగర్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్ను తెలంగాణ మంత్రి కేటీ రామారావు శనివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ) కింద రూ.32 కోట్లతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించింది.
ఈ ఫ్లైఓవర్ను అందుబాటులోకి రావడం వల్ల ట్రాఫిక్ రద్దీని చాలా వరకు తగ్గుతుందని నగర ప్రజలు భావిస్తున్నారు.
700మీటర్ల పొడవు, 12అడుగుల వెడల్పు, మూడు లేన్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఖమ్మం, నల్గొండ, విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రయాణికుల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగిస్తుంది.
ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీలోనే సిగ్నల్ ఫీ జంక్షన్గా ఇది నిలనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో కేటీఆర్
Yet another step by Telangana Govt to ease traffic congestion in Hyderabad. Watch Minister @KTRBRS speak after inaugurating LB Nagar RHS Flyover. https://t.co/YVovOUmMqm
— Minister for IT, Industries, MA UD, Telangana (@MinisterKTR) March 25, 2023