Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో తొలి దశను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరమైంది. ఎల్ అండ్ టీ సంస్థతో షేర్ల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. మొత్తం రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం వాటాలు ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి. మొదటిగా మార్చి 31నే మెట్రో స్వాధీనానికి తుది తేదీగా నిర్ణయించినప్పటికీ, భారతీయ రైల్వే ఆర్థిక సంస్థ నుంచి రుణం మంజూరులో ఆలస్యం జరగడంతో ఈ ప్రక్రియ గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించబడింది. దీంతో చివరకు అన్ని ప్రక్రియలు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, లార్సెన్ & టూబ్రో మరియు L&T మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్లతో కలిసి, ₹1,461.47 కోట్ల విలువతో 100% ఈక్విటీని సొంతం చేసుకునేందుకు వాటాల కొనుగోలు ఒప్పందంపై సంతకం.#Larsen #Toubro #SharePurchaseAgreement #HyderabadMetroRailLimited #UANow pic.twitter.com/k85oGhdczI
— UttarandhraNow (@UttarandhraNow) April 29, 2026